YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

నేను వైసీపీలోకే పోతా

నేను వైసీపీలోకే పోతా

విశాఖకు చెందిన టీడీపీ ముఖ్య నేత కన్నబాబు రాజు పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. పార్టీపై కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న ఆయన... వైసీపీలో చేరడం ఖాయమైందని జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. గత రెండు రోజులుగా అనుచరులతో మంతనాలు జరిపి... పార్టీ మారడంపై చర్చించారు. ఈ విషయం అధిష్టానం దృష్టికి వెళ్లడంతో... మంత్రి గంటా శ్రీనివాసరావు రంగంలోకి దిగారు. కన్నబాబు నివాసానికి వెళ్లి బుజ్జగించే ప్రయత్నం చేశారు. టీడీపీలో కొనసాగాలని సర్థిచెప్పగా... గతంలో ఏం ఆశించకుండా పార్టీలో చేరానని... 2014లో కూడా టీడీపీ విజయానికి కృషి చేశానని ఆయన గుర్తు చేశారట. పార్టీలో అందరూ తమను చిన్న చూపు చూశారని ఆవేదన వ్యక్తం చేశారట. మంత్రి గంటా బుజ్జగింపులు కూడా ఫలించలేదని... కన్నబాబు వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మే 5న అనుచరులతో కలిసి జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నట్లు మంత్రికి తెగేసి చెప్పేశారట. కన్నబాబు రాజు కాంగ్రెస్ హయాంలో ఎలమంచిలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితుల్లో టీడీపీలో చేరారు. ఎమ్మెల్యేగా అవకాశం రాకపోవడంతో... ఎమ్మెల్సీ పదవిపై కూడా ఆశ పెట్టుకున్నా అది కూడా దక్కలేదు. 2019లోనైనా అవకాశం వస్తుందని భావించినా... పరిస్థితులు అలా కనిపించకపోవడంతో పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు లోక‌ల్‌గా టాక్ నడుస్తోంది. 

Related Posts