చండీగఢ్ మే 18
సహజీవనం (లివ్ ఇన్ రిలేన్షిప్) పై పంజాబ్, హర్యానా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సహజీవనం అనే ఈ బంధం సామాజికంగా, నైతికంగా ఆమోదయోగ్యం కాదని స్పష్టంచేసింది. ప్రేమించుకుని ఇంటి నుంచి పారిపోయిన ఓ జంట తమకు రక్షణ కల్పించాలని కోరుతూ పంజాబ్, హర్యానా హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం సహజీనంపై పై వ్యాఖ్యలు చేసింది.గుల్జా కుమారి (19), గురువిందర్ సింగ్ (22) పంజాబ్లోని తార్న్ తరన్ జిల్లాకు చెందిన వారు. ఇద్దరూ ప్రేమించుకున్నారు. అయితే గుల్జాకుమారి తల్లిదండ్రులు వారి వివాహానికి ఒప్పుకోలేదు. ఈ క్రమంలో వారు ఇండ్ల నుంచి పారిపోయి సహజీవనం చేస్తున్నారు. గుల్జాకుమారి తల్లిదండ్రుల నుంచి తమకు ప్రాణహాని ఉందంటూ ఇటీవల వారు కోర్టును ఆశ్రయించారు.