YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

50 వేల క్యాష్ రివార్డు

50 వేల క్యాష్ రివార్డు

న్యూఢిల్లీ, మే 18, 
కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. రూ.50 వేల క్యాష్ రివార్డు అందిస్తోంది. ప్రత్యేకమైన కాంటెస్ట్ నిర్వహిస్తోంది. ఇందులో గెలిస్తే రూ.50 వేలు పొందొచ్చు. ఇంట్లో నుంచే ఎక్కడికీ వెళ్లకుండానే ఈ డబ్బులు గెలుచుకునే ఛాన్స్ అందుబాటులో ఉంది. ఇప్పుడు రూ.50 వేలు ఎలా గెలుచుకోవాలో తెలుసుకుందాం. మీరు రూ.50000 పొందాలని భావిస్తే ఒక పని చేయాలి. ఒక లోగో గీయాలి. వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ స్కీమ్‌కు ఒక లోగో వేసి ఇవ్వాలి. మీరు విజేతగా నిలిస్తే రూ.50 వేలు వస్తాయి. లాక్ డౌన్ సమయంలో రూ.50 వేలు పొందాలని భావించే వారికి ఇది మంచి ఛాన్స్. మై గౌ ఇండియా ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ మినిస్ట్రీ ఈ కాంటెస్ట్‌ను నిర్వహిస్తోంది. మీకు మే 31 వరకు గడువు ఉంది. తొలి విజేతకు రూ.50 వేలతోపాటు ఒక సర్టిఫికెట్ కూడా అందిస్తారు. అలాగే మరో ముగ్గురికి కూడా ఇసర్టిఫికెట్స్ లభిస్తాయి. మీరు మైగౌ పోర్టల్‌కు వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎవరైనాసరే ఈ కాంటెస్ట్‌లో పాల్గొనవచ్చు. ఒక్కొక్కరికి మూడు ఎంట్రీస్ ఉంటాయి. లోగో ఫార్మాట్ చాలా క్లియర్‌గా ఉండాలి. లోగో గురించి 100 పదాలతో వివరణ కూడా ఇవ్వాలి.

Related Posts