YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

హిదాయత్ మరణం కలచివేసింది

హిదాయత్ మరణం కలచివేసింది

విజయవాడ
తెలుగుదేశం పార్టీ నాయకులు, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ ఎండి హిదాయత్ హఠాత్మరణం కలచివేసిందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రజా సేవే పరమావధిగా జీవిస్తూ అనుక్షణం  మైనార్టీల సమస్యలపై పోరాటం చేసిన వ్యక్తి అని కొనియాడారు. ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ గా మైనార్టీల అభ్యోన్నతికి పాటుపడ్డారన్నారు.   నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు, సంక్షేమ పథకాలు మైనార్టీలకు అందించేందుకు విశేషమైన కృషి చేశారన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.  

Related Posts