YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పిల్లలను పనుల్లో పెట్టుకుంటే కఠిన చర్యలు

పిల్లలను పనుల్లో పెట్టుకుంటే కఠిన చర్యలు

నూజివీడు
కృష్ణా జిల్లా నూజివీడు పోలీస్ సర్కిల్ పరిధిలో  ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు ఆపరేషన్ ముస్కాన్   నిర్వహించారు. సర్కిల్లో 10మంది పిల్లలను పనులు చేయిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు, వారికి  ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ టెస్టులు చేయించారు. వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించి,  పిల్లలను వారికి అప్పగిస్తున్నట్లు సీఐ వెంకటరమణ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా మైనర్ పిల్లలను పనిలో పెట్టుకుంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Related Posts