న్యూఢిల్లీ మే 19
కొవిడ్-19 ధర్డ్ వేవ్ చిన్నారులపై పంజా విసరవచ్చనే ఆందోళనల నేపథ్యంలో పిల్లలను మహమ్మారి బారినుంచి కాపాడేందుకు ఓ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బుధవారం ప్రకటించారు.కొవిడ్-19 సెకండ్ వేవ్ వ్యాప్తితో తగినన్ని ఆక్సిజన్ బెడ్లు, కీలక ఔషధాలు, ఆక్సిజన్ పరికరాలను సిద్దం చేయాలని అధికారులతో జరిగిన భేటీలో ఆప్ ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా థర్డ్ వేవ్ వస్తే దానితో పోరాడేందుకు మనం ముందుగానే సన్నద్ధంగా ఉండాలని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. అధికారులతో జరిగిన భేటీలో ఈ దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నామని ఆయన వెల్లడించారు.