YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

సీఎం ఇంటి దగ్గర ఆత్మాహత్యాయత్నం

సీఎం ఇంటి దగ్గర ఆత్మాహత్యాయత్నం

విజయవాడ, మే 19, 
రాజధాని అమరావతి ప్రాంతం, తాడేపల్లి‌లోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయానికి సమీపంలో భరతమాత విగ్రహం వద్ద దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఉన్నట్లుండి పెట్రోల్ పోసుకుని బలవన్మరణానికి యత్నించారు. పోలీసులు వారిని తాడేప‌ల్లి పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు.పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కృష్ణా జిల్లాకు చెందిన నరేష్, సరస్వతి దంపతులు బుధవారం సీఎం జగన్ క్యాంపు కార్యాలయానికి వచ్చారు. సీఎం జగన్‌ను కలవాలని సెక్యురిటీ సిబ్బందిని దంపతులు కోరారు. అయితే కోవిడ్ కారణంగా కలవడం కుదరదని చెక్ పోస్టు సిబ్బంది చెప్పారు. విజ్ఞాపన పత్రాన్ని ఇస్తే పంపుతామని సిబ్బంది చెప్పింది. దీంతో మనస్తాపానికి గురైన దంపతులు ఒక్కసారిగా పెట్రోల్ పోసుకునే యత్నం చేయగా చెక్ పోస్టు సిబ్బంది అడ్డుకున్నారు.బాధిత మహిళకు ఫిట్స్ ఉండటంతో తాడేపల్లి‌లోని ప్రైమరీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. అయితే, తమ కుటుంబం ఆర్థిక పరిస్థితి సరిగా లేనందున క్యాంపు కార్యాలయానికి వచ్చినట్లు పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని.. సీఎం జగన్ స‌హాయం కోసం వ‌చ్చిన‌ట్లు దంప‌తులు చెబుతున్నార‌ని పోలీసులు వివ‌రించారు.

Related Posts