న్యూఢిల్లీ మే 20
ఇకపై కొవిడ్ లక్షణాలున్న వారంతా ఇక ఇంట్లోనే పరీక్షలు చేసుకోవచ్చు. కరోనా నిర్ధారణకు ఇంట్లో చేసుకునే ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టింగ్ కిట్ ‘కొవిసెల్ఫ్’కు ఐసీఎంఆర్ ఆమోదం తెలిపింది. దీని ద్వారా కొవిడ్ లక్షణాలున్న వ్యక్తలు స్వయంగా కిట్ను వినియోగించి ముక్కు ద్వారా నమూనాలు సేకరించి పరీక్ష చేసుకోవచ్చు. ల్యాబ్లో పాజిటివ్గా పరీక్షించిన వ్యక్తుల రోగ లక్షణాలు తెలుసుకునేందుకు, కాంటాక్ట్ పరిచయాలు మాత్రమే హోం టెస్ట్ కిట్ను వినియోగించాలని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. యాంటీజెన్ కిట్ల ద్వారా పాజిటివ్గా తేలిన వారందరినీ పాజిటివ్గా పరిగణించవచ్చని, అయితే వారికి మళ్లీ పరీక్షలు చేయాల్సిన అవసరం లేదని తెలిపింది.యాంటీజెన్ టెస్టు ద్వారా నెగెటివ్గా తేలి, లక్షణాలున్న వ్యక్తులందరూ వెంటనే ఆర్టీపీసీఆర్ టెస్టును చేయించుకోవాలని సూచించింది. యాంటీజెన్ టెస్టులో నెగెటివ్గా తేలి, లక్షణాలున్న వారందరినీ కొవిడ్ అనుమానితులుగా భావించొచ్చని, వారంతా ఐసీఎంఆర్.. ఆరోగ్య శాఖ హోం ఐసొలేషన్ మార్గదర్శకాలను పాటించాలని సూచించింది. ఈ ర్యాపిడ్ టెస్ట్ కిట్ను పుణెలోని మైల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ సంస్థ ఈ కిట్ను తయారు చేసింది.
‘కొవిసెల్ఫ్’కు ఎలా పని చేస్తుందంటే?
ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ కిట్ను వినియోగించేందుకు మొబైల్ యాప్ను గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. దాని ద్వారా పాజిటివ్, నెగెటివ్ రిపోర్టును అందుకోవచ్చు. ఇంట్లో టెస్ట్ చేసుకునే వారు తమ ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్న యాప్ నుంచి టెస్ట్ స్ట్రిప్ ఫొటో తీసి, అప్లోడ్ చేయాలి. ఈ డేటా నేరుగా ఐసీఎంఆర్ కరోనా టెస్ట్ పోర్టల్లో సేవ్ అవుతుంది. ఈ విధానంలో టెస్టు చేసుకున్న తర్వాత మరో టెస్టు అవసరం లేదు.ఈ టెస్టు ద్వారా పాజిటివ్ వచ్చినవారు హోంఐసొలేషన్లో ఉంటూ ఐసీఎంఆర్, ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుంది. నెగిటివ్ రిపోర్టు వచ్చేవరకూ హోం ఐసొలేషన్లోనే ఉండాలి. మైలాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ తయారు చేసిన ఈ కిట్ మరో వారంలో మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. దీని ధర సుమారు రూ.250 వరకు ఉంటుందని అంచనా. పరీక్ష ఫలితాలు ఐదు నుంచి నిమిషాలు పడుతుందని, గరిష్ఠంగా 15 నిమిషాలు పరీక్ష ఫలితాలు తెలుస్తాయని కంపెనీ పేర్కొంది.