హైదరాబాద్
ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ నగరానికి రానున్నారు. వరంగల్ ఎంజీఎం ఆస్పిటల్ ను సందర్శించనున్నారని సమాచారం. శుక్రవారం లేదా శనివారం అయన వరంగల్ పర్యటన వుండవచ్చు. వరుసగా రాష్ట్రంలో ని ప్రముఖ ప్రభుత్వ ఆస్పిటల్ ల సందర్శనకు అయన సిద్దమవుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు తెలుసుకోవడంతో పాటు , కోవిడ్ పేషెంట్ లకు వైద్యులకు మనోధైర్యం కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. బుధవారం ఆకస్మికంగా గాంధీ ఆసుపత్రిని సందర్శించిన సీఎం.. కరోనా పేషెంట్స్ కు ,వైద్యులకు భరోసా ఇచ్చారు.