YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

గడ్చిరోలి జిల్లాలో ఎన్కౌంటర్ .. 13 మంది మావోయిస్టులు మృతి

గడ్చిరోలి జిల్లాలో ఎన్కౌంటర్ .. 13 మంది మావోయిస్టులు మృతి

గడ్చిరోలి మే 21
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఎటపల్లి పరిధిలోని పేడి-కోటమి అటవీప్రాంతంలో మావోయిస్టులు- పోలీసుల మధ్య శుక్రవారం తెల్లవారుజామున భీకర కాల్పులు జరిగాయి. పోలీసు కాల్పుల్లో 13 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే ఆరుగురు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు గడ్చిరోలి డీఐజీ సందీప్‌ పాటిల్‌ వెల్లడించారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఘటనాస్థలంలో తుపాకులను, మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.సీ-60 బెటాలియన్‌కు చెందిన పోలీసులు ఎటపల్లి అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహిస్తుండగా నక్సల్స్‌ తారసపడటంతో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Related Posts