YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

నడిమి చెరువులో విషప్రయోగం... టన్ను 5క్వింటాళ్ల చేపలు మృతి

నడిమి చెరువులో విషప్రయోగం... టన్ను 5క్వింటాళ్ల చేపలు మృతి

సంగారెడ్డి మే 22
జిల్లాలోని హత్నూర మండల కేంద్రం శివారులోని నడిమి చెరువులో గుర్తుతెలియని దుండగులు విషప్రయోగం చేయడంతో సుమారు రూ.2లక్షల విలువైన చేపలు మృతి చెందాయి. ఈ మేరకు గ్రామ మత్స్య సహకార సంఘం సభ్యులు మాట్లాడుతూ.. గత సంవత్సరం ఆగస్టులో 2లక్షల 80వేల చేపపిల్లలు చెరువులో వదిలి అప్పటి నుంచి చెరువు కాపలా ఉంటున్నామన్నారు. త్వరలోనే చేతికొచ్చిన చేపలు అమ్మాలని చూడగా శుక్రవారం ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు చెరువులో విషప్రయోగం చేయడంతో సుమారు ఒక టన్ను 5క్వింటాళ్ల చేపలు మృతి చెందాయని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం మత్స్యకారులను ఆదుకొని చేపలపై విషప్రయోగం చేసిన దుండగులను గుర్తించి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు

Related Posts