YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

ఆఫ్ లైన్ లోకి పేటీఎం

ఆఫ్ లైన్ లోకి పేటీఎం

పేటీఎం సంస్థ మరో ముందడుగు వేసింది. బ్యాంకింగ్ సేవలను వినియోగదారులకు అందిస్తోంది. అయితే తాజాగా 'ఆఫ్‌లైన్‌' పేమెంట్‌ సేవలను ప్రవేశపెట్టింది. ‘టాప్‌ కార్డ్‌’ పేరుతో ప్రవేశపెట్టిన ఈ ఆప్షన్‌తో డబ్బు బదిలీ చేసుకోవడం మరింత సులభం. దేశంలోనే ఇలాంటి సేవలను ప్రవేశపెట్టిన ఘనత పేటీఎంకే దక్కుతుంది. ఇంటర్నెట్‌, ఫోన్ అవసరం లేకుండానే దీనిద్వారా నగదు బదిలీ చేసుకోవచ్చు. టాప్‌ కార్డ్‌ నుంచి పేమెంట్స్‌ చేయడానికి వినియోగదారులు టాప్‌ కార్డ్‌పై ఉన్న క్యూఆర్ కోడ్‌ స్కాన్‌ చేయడం ద్వారా పేటీఎం ఖాతా నుంచి అందులోకి డబ్బు జమ చేసుకోవచ్చు. ఆ కార్డు ద్వారా సులభంగా చెల్లించవచ్చు. ఇంటర్నెట్ వినియోగించని వారికోసం ఈ తరహా సేవలను ప్రవేశపెట్టినట్లు పేటీఎం సీఓఓ కిరణ్‌ వాసిరెడ్డి తెలిపారు.

Related Posts