YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం విదేశీయం

భారత్ లో కరోనా బీభత్సం మధ్యాదాయ దేశాలకు హెచ్చరిక: ఐఎంఎఫ్

భారత్ లో కరోనా బీభత్సం మధ్యాదాయ దేశాలకు హెచ్చరిక: ఐఎంఎఫ్

వాషింగ్టన్ మే 22
భారత్ లో బీభత్సంగా సాగుతున్న కరోనా సెకండ్‌వేవ్ “కల్లోలం” ఇప్పటివరకు తీవ్ర సమస్య ఎదుర్కోని ఇతర మధ్యాదాయ దేశాలకు హెచ్చరిక వంటిదని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ఒక నివేదికలో తెలిపింది. చీఫ్ ఎకనమిస్ట్ గీతా గోపీనాథ్, ఎకనమిస్ట్ రుచిర్ అగర్వాల్ ఈ నివేదికను సంయుక్తంగా రూపొందించారు. 2021 చివరినాటికి ఇండియాలో 35 శాతం జనాభాకు మాత్రమే టీకాలు అందుతాయని నివేదిక తెలిపింది. భారత్ లో ఘోరమైన సెకండ్ వేవ్, బ్రెజిల్ లో మరో కరోనా కల్లోలం తలెత్తడం గమనిస్తే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మరిత దారుణమైన పరిస్థితులు తలెత్తుతాయని అనిపిస్తున్నట్టు పేర్కొన్నది.మొదటి విడత కరోనా కల్లోలాన్ని బాగానే తట్టుకున్న భారత్ రెండో విడత కల్లోలంలో కకావికలు అవుతున్నదని తెలిపింది. ఆక్సిజన్, బెడ్లు , ఇతర వైద్య సౌకర్యాలు లేక అనేకమంది మృత్యువాత పడుతున్నారని నివేదిక వివరించింది. ఇప్పటిదాకా ఆఫ్రికాతోసహా పలు ప్రాంతాల్లో తీవ్రమైన ముప్పును తప్పించుకోగలిగిన అల్పాదాయ, మధ్యాదాయ దేశాలకు భారత్ పరిస్థితి ఓ హెచ్చరిక లాంటిదని ఐఎంఎఫ్ నివేదిక తెలిపింది. ప్రస్తుతం కోవాక్స్ కార్యక్రమం కింద ద్వైపాక్షిక మార్గాల ద్వారా సేకరిస్తున్న టీకాలతో భారత్ 2022 మధ్యనాటికి 25 శాతం జనాభాకు రోగనిరోధకత కల్పించగలదు. కానీ 60 శాతం లక్ష్యం సాధించాలంటే భారత్ తక్షణమే 100 కోట్ల డోసులకు ఆర్డరు చేయాల్సి ఉంటుందని ఐఎంఎఫ్ నివేదిక సూచించింది.

Related Posts