హైదరాబాద్ మే 23,
తెలంగాణలోని పది యూనివర్సిటీలకు వైస్ ఛాన్స్లర్లను ప్రభుత్వం నియమించింది. ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ డి. రవీందర్ యాదవ్, కాకతీయ యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ టీ. రమేశ్, తెలంగాణ యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ రవీందర్ గుప్తా, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ సీతారామరావు, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ కిషన్ రావు, పాలమూరు యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ లక్ష్మీకాంత్ రాథోడ్, జేఎన్టీయూ వీసీగా కట్టా నర్సింహారెడ్డి, మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ సీహెచ్ గోపాల్ రెడ్డి, శాతవాహన యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ మల్లేశం, జవహర్ లాల్ ఆర్కిటెక్కర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వీసీగా ప్రొఫెసర్ కవిత దర్యాని నియామకం అయ్యారు.