YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసుల‌ను గుర్తించేందుకు రంగం లోకి శున‌కాలు

క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసుల‌ను గుర్తించేందుకు రంగం లోకి శున‌కాలు

లండ‌న్‌ మే 24
 క‌రుడుక‌ట్టిన నేర‌స్థుల‌ను.. దొంగ‌ల‌ను ప‌ట్టుకునేందుకు పోలీసులు జాగిలాల‌ను వాడుతున్న విష‌యం తెలిసిందే. అయితే క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసుల‌ను కూడా గుర్తించేందుకు శున‌కాలు బాగా ప‌నిచేస్తున్న‌ట్లు తెలుస్తోంది. కుక్క‌ల‌కు స‌రైన శిక్ష‌ణ ఇస్తే ల‌క్ష‌ణాలు లేన‌టువంటి రోగుల‌ను కూడా గుర్తించే అవ‌కాశం ఉందని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. విమానాశ్ర‌యాల్లో అరైవ‌ల్స్ వ‌ద్ద శున‌కాల వ‌ల్ల చాలా మంది రోగుల‌కు ఈజీగా గుర్తించ‌వ‌చ్చు అని లండ‌న్ స్కూల్ ఆఫ్ ట్రాపిక‌ల్ మెడిసిన్ త‌న అధ్య‌య‌నంలో తేల్చింది. శున‌కాల్లో ఉండే వాస‌న ప‌సిక‌ట్టే గుణం అత్యం కీల‌క‌మైంద‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. క్యాన్స‌ర్‌, మ‌లేరియా, ఎపిలెప్సీ లాంటి వ్యాధి గ్ర‌స్తుల‌ను ఇప్ప‌టికే కుక్క‌లు గుర్తిస్తున్న‌ట్లు నివేదిక‌లో చెప్పారు.సార్స్ సీవోవీ2 వైర‌స్‌ను కుక్క‌లు గుర్తుప‌ట్టిన‌ట్లు ఇప్ప‌టికే అనేక అధ్య‌య‌నాలు వెల్ల‌డించిన‌ట్లు తెలిపారు. సార్స్ సీవోవీ2 వైర‌స్ సోకి పాజిటివ్‌గా తేలిన వ్య‌క్తిలో ఉన్న స్వ‌ల్ప ల‌క్ష‌ణాల వ‌ల్ల వ‌చ్చే స్మెల్‌తో కుక్క‌ల‌కు ట్రైనింగ్ ఇస్తున్నారు. కోవిడ్ రోగులు వాడిన దుస్తులు, ఫేస్ మాస్క్‌ల‌ను వాస‌న ద్వారా ప‌సిక‌ట్టే రీతిలో శున‌కాల‌కు ట్రైనింగ్ ఇచ్చారు. సుమారు 200 మంది కోవిడ్ రోగులు ధ‌రించిన సాక్సుల‌ను ఆరు శున‌కాల ద్వారా ల్యాబ్‌లో ప‌రీక్షించారు. రోగులు ధ‌రించిన సాక్సుల్లో ఉన్న రసాయ‌నిక ప‌దార్ధాల వాస‌న గుర్తించేలా కుక్క‌ల‌కు శిక్ష‌ణ ఇచ్చారు. క‌చ్చితంగా పాజిటివ్ వ్యాధి గ్ర‌స్తుడిని ప‌ట్టుకునే రీతిలో శిక్ష‌ణ ఇచ్చిన‌ట్లు లండ‌న్ స్కూల్ ఆఫ్ ట్రాపిక‌ల్ మెడిసిన్ గెస్ట్ క్లారీ తెలిపారు. అయితే సార్స్ సీవోవీ2 శ్యాంపిళ్ల‌లో క‌నీసం 94 శాతం కేసుల‌ను గుర్తించిన‌ట్లు ప‌రిశోధ‌కులు అంచ‌నా వేశారు. కుక్కులు గుర్తించిన వారికి నిర్వ‌హించిన‌ పీసీఆర్ ప‌రీక్ష‌ల ఆధారంగా డేటాను స‌రిచూసుకున్నారు.విమానాశ్ర‌యాల్లో టర్మిన‌ల్స్ వ‌ద్ద కుక్కులు సుమారు 91 శాతం పాజిటివ్ కేసుల‌ను గుర్తించిన‌ట్లు ప‌రిశోధ‌కులు తెలిపారు. ఇది పీసీఆర్ ప‌రీక్ష‌ల‌తో పోలిస్తే 2.24 శాతం మాత్ర‌మే త‌క్కువ అని అన్నారు. ఎయిర్‌పోర్ట్‌లో అరైవ‌ల్స్ వ‌ద్ద పాజిటివ్‌గా దొరికిన వ్య‌క్తుల‌కు అద‌నంగా పీసీఆర్ టెస్టులు చేయ‌వ‌చ్చు అని, దాని ద్వారా క్వారెంటైన్ నియ‌మావ‌ళి ఈజీ అవుతుందని ప‌రిశోధ‌కులు చెప్పారు. విమానాశ్ర‌యాలు, రైల్వే స్టేష‌న్ల వ‌ద్ద ల‌క్ష‌ణాలు లేన‌టువంటి కోవిడ్ రోగుల‌ను ఏ మేర‌కు కుక్కులు గుర్తిస్తాయ‌న్న దానిపై ఇంకా అధ్య‌యం చేయాల్సి ఉంద‌ని బ్రిస్ట‌ల్ వ‌ర్సిటీ ప్రొఫెస‌ర్ బెయిల్ తెలిపారు.

Related Posts