YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

మరో ఎమ్మెల్యేపై కేసు

 మరో ఎమ్మెల్యేపై కేసు

హైద్రాబాద్, మే 24, 
భూ వివాదం కేసులో మరో ఎమ్మెల్యేపై ఆరోపణలు వచ్చాయి. హైదరాబాద్‌లోని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పై కేసు నమోదు అయ్యింది. కోర్టు ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాప్రాలోని సర్వే నెంబర్ 152లో 90 ఎకరాల భూ వివాదంలో తలదూర్చినట్లు ఎమ్మెల్యే పై ఆరోపణలు వచ్చాయి దీంతో ఉప్పల్ ఎమ్మెల్యే తో పాటు కప్రా ఎమ్మార్వో గౌతమ్ కుమార్ మీద జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. వీరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.సెక్షన్ 1206,166a,167,168,170,171,447,468,471,307,506 కింద కేసు నమోదు అయ్యింది. ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి తమ వద్ద డబ్బులు డిమాండ్ చేశాడని మేకల శ్రీనివాస్ యాదవ్....అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి టీఆర్ఎస్‌ నేత. 2018 లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీ చేసి సమీప తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తుళ్ళ వీరేందర్ గౌడ్ పై 48,168 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.ఆ తర్వాత 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పై పోటీ చేసి సమీప భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ప్రభాకర్ పై 14,169 ఓట్ల మెజారిటీతో ఓడిపోయారు. ప్రస్తుతం ఉప్పల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Related Posts