YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం

రూ.1.18 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను పోలీసులు స్వాధీనం

రూ.1.18 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను పోలీసులు స్వాధీనం

ముంబై మే 24
దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలోని బాంద్రాలో రూ.1.18 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా 75 ఏళ్ల మహిళ సహ.. మరో వ్యక్తిని అరెస్టు చేశారు. సదరు మహిళను జోహ్రబాయ్‌ షేక్‌గా గుర్తించారు. మాదకద్రవ్యాలను విక్రయించేందుకు ఓ వ్యక్తి శనివారం బాంద్రాలోని వాటర్‌ ఫీల్డ్‌ రోడ్‌కు వచ్చే అవకాశం ఉందని క్రైమ్‌ బ్రాంచ్‌కు నిర్ధిష్ట సమాచారం అందిందని, ఈ మేరకు కిశోర్‌ గావ్లి (57) అనే వ్యక్తిని వలవేసి పట్టుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా.. జోహ్రబాయ్‌ షేక్‌ తనకు విక్రయించిందని తెలిపారు. దీంతో పోలీసులు బాంద్రాలోని ఆమె నివాసం దాడులు చేసి మూడు కిలోల చరాస్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఇద్దరు చాలా రోజులుగా మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. వారిపై నార్కోటిక్‌ డ్రగ్‌, సైకోట్రోపిక్‌ పదార్థాల చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

Related Posts