మ్మం
మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి ఖమ్మం జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ చేకూరి కాశయ్య మృతి పట్ల అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జడ్పీ చైర్మన్ గా తామిద్దరం సమకాలీనులమని, తాను అదిలాబాద్ జడ్పీ చైర్మన్ గా వున్నప్పుడు ఖమ్మం జిల్లా జడ్పీ చైర్మన్ గా కాశయ్య ఉన్నారని, ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేసుకున్నారు.