విశాఖపట్నం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇంటింటికి రేషన్ బియ్యం ఎక్కడ, డోర్ డెలివరీ ప్రకారంగా ఇంటింటికి రేషన్ అందించేటప్పుడు డి.ఆర్ డిపోల వద్ద జనం పడిగాపులు కాస్తున్నటువంటి సంఘటనలు కనిపిస్తుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి .మండలంలో గల గుత్తులపుట్టు డి ఆర్ డిపో గ్రామ పరిధిలో సుమారు పది గ్రామాలకు సంబంధించిన ప్రజలకు రేషన్ సరుకులు అందించాల్సి ఉంది. అయితే ఈ సుమారు 10 గ్రామాలలో రేషన్ డోర్ డెలివరీ పథకం అందించటంలేదుకావున ప్రతిసారి డిపో వద్దనే వచ్చి రేషన్ తీసుకొంటున్నామని పలువురు లబ్దిదారులు వాపోతున్నారు. రేషన్ డోర్ డెలివరీ పథకం పెట్టి ఇన్ని నెలలు గడుస్తున్నా వీరికి ఒక్కసారి కూడా రేషన్ డోర్ డెలివరీ అందించాకపోవడం బాధాకరమైన విషయం. ఇంటింటికి రేషన్ విషయంలో అందరికీ ఒక తీరు, గుత్తులపుట్టు పంచాయతీ ప్రజలకు మాత్రం మరొక తీరు, కావున సంబంధిత అధికారులు స్పందించి ఇక్కడ ప్రజలకు న్యాయం జరిగే విధంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం చాలా వరకు ఉంది.