విశాఖపట్నం
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాల ని, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఉద్యమం ప్రారంభమై నేటికి ఆరు నెలలు పూర్తైన సందర్భం గా ప్రజాసంఘాల నేతలు దేశవ్యాప్తం గా బ్లాక్ డే కు పిలుపునిచ్చారు.దింట్లో భాగంగా విశాఖలో సీపీఎం నేతలు నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద సీపీఎం నేతలు చేపట్టిన నిరసన కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నర్సింగరావు పాల్గొని కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు.గత ఆరు నెలలుగా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న కేంద్రం ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కేంద్ర ప్రభు త్వం రైతుల సమస్యలపై స్పందించా లని డిమాండ్ చేశారు.