హైదరాబాద్ మే 26
భారతీయ జనతా పార్టీ సేవా హి సంఘటన కార్యక్రమంలో భాగంగా చాంద్రాయణగుట్ట నియోజక వర్గం ఉప్పుగూడ డివిజన్ లో పేదలకు ఉచిత ఆహార పంపిణీ కార్యక్రమంలో బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పాల్గొన్నారు. ఈ సందర్బంగా అరుణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మాస్కులు ధరిస్తూ,సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ కోవిడ్ నిబందనలు పాటించాలని కోరారు.ప్రస్తుతం రాష్ట్రము లో లాక్ డౌన్ కొనసాగుతున్నందున ఇల్లల్లోనే ఉండాలని,కోవిడ్ లక్షణాలు ఉంటె దగ్గరలోని ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకొని క్రమం తప్పకుండ డాక్టర్స్ సూచించిన మందులు వాడి కోవిడ్ను జయించాలన్నారు.నాకు కరోనా వచ్చింది అని ఆదైర్య పడవద్దని దైర్యం తో ఉంటే మనలను ఏ లాంటి జబ్బులు దరిచేరవన్నారు.. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ జిల్లా అధ్యక్షులు సామ రెడ్డి సురేందర్ రెడ్డి, చంద్రాయన గుట్ట బీజేపీ ఇంచార్జ్ సయ్యద్ సయ్యద్ షహెజాది, తదితర బిజెపి నాయకులు పాల్గొన్నారు.