YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఆర్మీ ఆసుపత్రినుంచి ఎంపీ రఘురామ డిశ్చార్జ్

ఆర్మీ ఆసుపత్రినుంచి ఎంపీ రఘురామ డిశ్చార్జ్

కింద్రాబాద్
సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి నుంచి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు బుధవారం డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించారే ఆరోపణలపై ఏపీ సీఐడీ రఘురామపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసి గుంటూరు తరలించింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆయన్ను సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అప్పటినుంచి అయనకు అక్కడే చికిత్స జరిగింది.  ఇటీవల సుప్రీంకోర్టు రఘురామకు బెయిల్ మంజూరు చేసింది.  దీంతో ఆయన బుధవారం డిశ్చార్జ్ అయ్యారు. ఆర్మీ ఆస్పత్రి నుంచి రఘురామకృష్ణరాజు నేరుగా  విమానాశ్రయం చేరుకుని ఢిల్లీకి బయలుదేరారు.

Related Posts