YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ప్రాణాలు ఫ‌ణంగా పెట్టి విధులు నిర్వ‌ర్తిస్తున్నాం.. అన‌వ‌స‌రంగా రోడ్ల‌పైకి రావొద్దు - సిపీ

ప్రాణాలు ఫ‌ణంగా పెట్టి విధులు నిర్వ‌ర్తిస్తున్నాం.. అన‌వ‌స‌రంగా రోడ్ల‌పైకి రావొద్దు - సిపీ

హైద‌రాబాద్ మే 26
క‌రోనా క‌ష్ట‌కాలంలో ప్రాణాలు ఫ‌ణంగా పెట్టి విధులు నిర్వ‌ర్తిస్తున్నామ‌ని న‌గ‌ర పోలీసు క‌మిష‌న‌ర్ అంజ‌నీ కుమార్ తెలిపారు. ప్ర‌జ‌ల ప్రాణాల ర‌క్ష‌ణ కోసం నిరంత‌రం ప‌ని చేస్తున్నామ‌ని చెప్పారు. లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను ప్ర‌జ‌లు క‌చ్చితంగా పాటించాలి. అన‌వ‌స‌రంగా రోడ్ల‌పైకి ఎవ‌రూ రావొద్దు. వాహ‌నాలు సీజ్ అయితే లాక్‌డౌన్ పూర్త‌యిన త‌ర్వాతే అప్ప‌గిస్తామ‌న్నారు. 99 శాతం లాక్‌డౌన్ విజ‌య‌వంత‌మైంది. ఈ-పాసుల‌ను దుర్వినియోగం చేసే వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. అత్య‌వ‌స‌ర సేవ‌ల‌కు ఎలాంటి ఆటంకం లేకుండా చూస్తున్నామ‌ని సీపీ తెలిపారు.

Related Posts