YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ప్ర‌జారోగ్య దృష్ట్యా త‌క్ష‌ణ‌మే విధుల్లో చేరాలి... జూడాల‌కు సీఎం కెసిఆర్ విజ్ఞప్తి

ప్ర‌జారోగ్య దృష్ట్యా త‌క్ష‌ణ‌మే విధుల్లో చేరాలి...  జూడాల‌కు సీఎం కెసిఆర్ విజ్ఞప్తి

హైద‌రాబాద్ మే 26
క‌రోనా విప‌త్క‌ర వేళ జూనియ‌ర్ డాక్ట‌ర్లు స‌మ్మెకు పిలుపునివ్వ‌డం స‌రికాదు అని సీఎం కేసీఆర్ అన్నారు. ప్ర‌జారోగ్య దృష్ట్యా త‌క్ష‌ణ‌మే విధుల్లో చేరాల‌ని జూడాల‌కు సీఎం సూచించారు. జూడాల ప‌ట్ల ప్ర‌భుత్వం ఏనాడూ వివ‌క్ష చూప‌లేదు అని స్ప‌ష్టం చేశారు. న్యాయ‌మైన డిమాండ్ల‌ను ప‌రిష్క‌రించ‌డానికి ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌న్నారు. స‌మ‌య‌, సంద‌ర్భాలు చూడ‌కుండా విధుల‌ను బ‌హిష్క‌రించ‌డం స‌రికాదు. క‌రోనా వేళ స‌మ్మె నిర్ణ‌యాన్ని ప్ర‌జ‌లు హ‌ర్షించ‌రు.సీనియ‌ర్ రెసిడెంట్లకు ఇచ్చే గౌర‌వ వేతం 15 శాతం పెంచాల‌ని నిర్ణ‌యించారు. మూడేళ్ల వైద్య విద్య‌తో కొవిడ్ విధుల్లో ఉన్న‌వారికి గౌర‌వ వేతనం పెంచాల‌ని నిర్ణ‌యించారు. సీనియ‌ర్ రెసిడెంట్ల‌కు ఇచ్చే గౌర‌వ వేత‌నం ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. ఈ నిర్ణ‌యాల‌పై త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, జూనియ‌ర్ వైద్యుల స‌మ‌స్య‌ల‌ను వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని సీఎం అధికారుల‌ను ఆదేశించారు.

Related Posts