YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఒకసారి కోవాగ్జిన్...రెండోసారి కోవిషీల్డ్... లక్నోలో డాక్టర్ల పొరపాటు

 ఒకసారి కోవాగ్జిన్...రెండోసారి కోవిషీల్డ్... లక్నోలో డాక్టర్ల పొరపాటు

లక్నో, మే 26, 
ప్రస్తుతం కోవిషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఈ రెండు టీకాలను వినియోగిస్తున్నారు. తొలి డోస్ ఏ టీకా తీసుకుంటే రెండో డోస్‌ కూడా అదే తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఒకసారి కోవిషీల్డ్, ఇంకోసారి కొవాగ్జిన్ డోస్‌ వేసిన ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. ఓ గ్రామానికి చెందిన దాదాపు 20 మందికి ఇలాగే ఇచ్చారు. నేపాల్ సరిహద్దుల్లోని సిద్ధార్థ్‌నగర్ జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇలా జరిగింది.అయితే, ఇది పొరపాటున జరిగిందంటూ వైద్యాధికారి చేతులు దులుపుకోవడం గమనార్హం. ఈ గ్రామంలోని కొందరికి తొలి డోస్ ఏప్రిల్ మొదటి వారంలో కోవిషీల్డ్ ఇచ్చారు. మే 14న వీరికి రెండో డోస్‌ కొవాగ్జిన్ ఇచ్చినట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే, వారికి ఎటువంటి దుష్పరిణామాలు, అనారోగ్య సమస్యలు తలెత్తలేదని అధికారులు పేర్కొన్నారు.ఇది ఖచ్చితంగా పొరపాటే.. వ్యాక్సిన్లు కలిపి ఇవ్వాలని యంత్రాంగానికి ప్రభుత్వ నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదు.. కాబట్టి, ఇది పొరపాటున జరిగింది.. ఈ ఘటనపై విచారణకు ఆదేశించి నివేదిక కోరాం.. ఈ నిర్వాకం చేసినవారికి వివరణ కోరాం.. దీనిపై వీలైనంత వరకు చర్యలు తీసుకుంటాం’’ అని సిద్ధార్థ్ నగర్ జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సందీప్ చౌధురి అన్నారు.మిక్సింగ్ టీకాల ప్రభావం, సమర్థతపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు సాగుతున్నాయి. మిక్సిడ్ వ్యాక్సిన్లు తీసుకున్న వారంతా ఆరోగ్యంగానే ఉన్నారు. తొలి డోస్ కోవిషీల్డ్, రెండో డోస్ కొవాగ్జిన్ తీసుకున్న ప్రతి ఒక్కరితోనూ మా వైద్య బృందం మాట్లాడిందని, ఎటువంటి దుష్పరిణామాలు ఎదుర్కొలేదని చెప్పారని సందీప్ చౌధురి పేర్కొన్నారు.వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఎవరూ తమను పరీక్షించలేదని మిక్సిడ్ టీకాలు తీసుకున్న గ్రామస్థులు చెప్పడం గమనార్హం. ‘‘తనకు కొవాగ్జిన్ డోస్ ఇచ్చినట్టు గుర్తించారు.. ఏదో తప్పు జరిగిందని ఓ వైద్యుడు చెప్పాడు’’ అని గ్రామానికి చెందిన రామ్ సూరత్ అనే వృద్ధుడు అన్నారు. ఈ వేర్వేరు డోస్‌ల ఇవ్వడం గురించి భయపడుతున్నాం అని అన్నాడుఏప్రిల్ 1న తొలి డోస్ కోవిషీల్డ్ తీసుకున్నా.. రెండో డోస్ మే 14న వేయించుకున్నా.. రెండో డోస్ వేయించుకోడానికి వెళ్లినప్పుడు ఎవ్వరూ పరీక్షించలేదు.. కోవిషీల్డ్‌కు బదులు కొవాగ్జిన్ ఇచ్చారు.. ఇది భయాందోళనకు గురిచేస్తోంది’’ అని అన్నారు. దేశంలో వ్యాక్సినేషన్ నెమ్మదిగా సాగుతున్న పెద్ద రాష్ట్రాల్లో యూపీ ముందు వరుసలో ఉంది. అక్కడ కేవలం 1.4 శాతం జనాభాకే వ్యాక్సిన్ వేశారు. గుజరాత్, కేరళ వంటి రాష్ట్రాల్లో జాతీయ సగటు కంటే ఎక్కువగా వ్యాక్సినేషన్ జరిగింది. మూడు నెలల్లో రాష్ట్రానికి 1.75 కోట్ల డోస్‌లను అందజేయగా.. కేవలం 33 లక్షల మందికే పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ అందింది.

Related Posts