YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

రాందేవ్ బాబాపై 1000 కోట్ల పరువు నష్టం

 రాందేవ్ బాబాపై 1000 కోట్ల పరువు నష్టం

న్యూఢిల్లీ, మే 26, 
కరోనా కట్టడిలో ఆధునిక వైద్యం విఫలమైందని, అదో పనికిమాలిందంటూ యోగా గురు రాందేవ్ నోరుజారిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన వాటిని వెనక్కు తీసుకున్నారు. ఈ అంశంపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఇప్పటికే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా, రాందేవ్‌పైఐఎంఏ ఉత్తరాఖండ్ విభాగం పరువు నష్టం దావా వేసింది. ఆధునిక వైద్యంపై ఆయన చేసిన వ్యాఖ్యలకు రూ.1,000 కోట్ల పరువు నష్టం చెల్లించాలని డిమాండ్ చేసింది.అల్లోపతిపై చేసిన వ్యాఖ్యలను వెనక్కుతీసుకున్నా.. ఆయన వివరణ సంతృప్తికరంగా లేదని వైద్యుల సంఘం వ్యాఖ్యానించింది. దీంతో ఆయనపై పరువు నష్టం కేసు వేసినట్టు తెలిపింది. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని చెప్పిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష్‌వర్దన్‌‌కు ప్రతిగా రాందేవ్ ఓ లేఖ రాశారు. ఆధునిక వైద్యానికి తాను విరోధిని కాదని ఆ లేఖలో బాబా స్పష్టం చేశారు. ప్రాణాలను రక్షించే విషయంలో అల్లోపతి శస్త్రచికిత్స అపారమైన పురోగతిని సాధించిందని, అది మానవాళికి చాలా సేవ చేస్తుందని నమ్ముతున్నానని పేర్కొన్నారు.ఓ సమావేశంలో తనకొచ్చిన ఓ వాట్సప్ మేసేజ్ చదివిందే తప్ప.. ఎవరి మనోభావాలను దెబ్బతీయడానికి చేయలేదన్నారు. తన వ్యాఖ్యలు ఎవరి మనోభావాలను నొప్పించి ఉంటే క్షమించాలని కోరారు. కరోనా కాలంలో అల్లోపతి డాక్టర్లు తమ ప్రాణాలను లెక్కచేయకుండా కోట్లాది మందిని కాపాడారని కొనియాడారు. క్షమాపణలు చెప్పిన మర్నాడే ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఫార్మా కంపెనీలకు 25 ప్రశ్నలతో ఒక బహిరంగ లేఖ రాశారు.పతంజలి యోగపీఠ్ తరఫున ప్రశ్నలు సంధించిన రాందేవ్... రకరకాల వ్యాధులకు అల్లోపతీలో శాశ్వత పరిష్కారం ఉందా అని నిలదీశారు. కొన్ని అనారోగ్య సమస్యలకు మందులు తయారు చేయగలవా అని ఫార్మా కంపెనీలను అడిగారు. అల్లోపతీలో బీపీ, దాని వల్ల వచ్చే ఇతర సమస్యలకు ఉన్న శాశ్వత పరిష్కారం ఏంటి. అల్లోపతీలో టైప్-1, టైప్-2 డయాబెటిస్ కోసం ఉన్న శాశ్వత పరిష్కారం ఏంటి? థైరాయిడ్, ఆర్థరైటిస్, డయాబెటిస్, ఆస్థమా లాంటి అనారోగ్య సమస్యలకు ఫార్మా పరిశ్రమ దగ్గర ఉన్న శాశ్వత పరిష్కారం ఏంటి? అని ప్రశ్నించారు.

Related Posts