YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

దీక్షల వెనుక ప్రజాధనం : మాజీ మంత్రి మాణిక్యాలరావు

దీక్షల వెనుక ప్రజాధనం : మాజీ మంత్రి మాణిక్యాలరావు

దీక్షల పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. మొన్న చేపట్టిన దీక్షలో 30 కోట్ల రూపాయల ఖర్చుకు లెక్కలు చూపాలని మాజీ మంత్రి, బీజేపీ నేత  మాణిక్యాలరావు డిమాండ్ చేసారు. భారీ సెట్టింగులతో చంద్రబాబు నాయుడు చేస్తున్న దీక్షలు ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. దీక్షలకు ప్రభుత్వ యంత్రాంగం తో డ్వాక్రా మహిళలను, విద్యార్థులను భయపెట్టి దీక్షలకు తరలించడం ఎటువంటి రాజకీయమో అర్థం కావడం లేదని అయన వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు నాయుడుకి ఇప్పటికికూడా చిత్తశుద్ధి లేదు తన రెండు నాలుకలు విధానాన్ని అమలుచేయడమే ఏకైక ఎజెండాగా ముఖ్యమంత్రి పరిపాలన సాగిస్తున్నారని అయన విమర్శించారు. 

Related Posts