అమరావతి మే 26
టీడీపీ ఎప్పుడూ ముఠా రాజకీయాలకు దూరమని, జగన్ అధికారంలోకి వచ్చి ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేపారని ఆరోపించారు. అక్రమ కేసులు బనాయించి సీఎం పైశాచిక ఆనందం పొందుతున్నారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. రాష్ట్రంలో కొందరు పోలీసులు వైసీపీ నాయకుల్లా పనిచేస్తున్నారని చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రఘురామను కొట్టినందుకు సీబీఐ విచారణ ఎదుర్కుంటోందని అన్నారు. సీఎం జగన్రెడ్డి ఏమాత్రం సిగ్గులేకుండా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. జగన్ను నమ్మకున్నవాళ్లు ఇప్పటికే జైలుకు వెళ్లొచ్చారని.. పోలీసులకూ ఇదే గతి పడుతుందని ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. ప్రభుత్వాలు శాశ్వతం కాదని, దౌర్జన్యాలను వడ్డీతో సహా చెల్లించేరోజు దగ్గరలోనే ఉందని చంద్రబాబు అన్నారు.బీసీ జనార్ధన్రెడ్డి చేసిన తప్పేంటని చంద్రబాబు ప్రశ్నించారు. హింసను ప్రేరేపించే విధంగా జనార్ధన్రెడ్డి ఎప్పుడూ పనిచేయలేదన్నారు. అభివృద్ధి కోసం నిరంతరం ఆకాంక్షించారన్నారు. జనార్ధన్రెడ్డి ఇంటి దగ్గరకు కాటసాని రామిరెడ్డి అనుచరులు ఎందుకొచ్చారని బాబు నిలదీశారు. గొడవ చేసిన వారిపై కాకుండా బాధితులపై కేసులు పెట్టడమేంటని మండిపడ్డారు.