YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

విశాఖలో ఎన్టీఆర్ జయంతి

విశాఖలో ఎన్టీఆర్ జయంతి

విశాఖపట్నం
సీని రంగంలో తెలుగు జాతికి ఎన్టీఆర్ మంచి పేరు తెచ్చారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఎన్టీఆర్ 98 వ జయంతి సందర్భం గా విశాఖ బీచ్రోడ్లో ఉన్న  ఆయన విగ్రహానికి అచ్చెన్నాయుడు,ఎమ్మెల్యే వెలగపూడి, టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, నగర టీడీపీ నేతలు నివాళర్పించారు. అనంతరం అచ్చెన్నా మాట్లాడుతూ తెలుగు జాతికి సేవ చేయాలని సినీ రంగాన్ని విడిచి పెట్టి రాజకీయంలోకి వచ్చారన్నారు. రాజకీయలోకి వచ్చిన తర్వాత  ప్రజల్లో చైతన్యం తెచ్చారని తెలిపారు. నేడు పిల్లకాకి  సంక్షేమం కోసం మాట్లాడుతున్నారని.. సంక్షేమం అంటే ఆనాడు ఎన్టీఆర్ పెట్టినవే అని స్పష్టం చేశారు. ఆనాడు జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలను ఏకం చేసి పోరాటం చేసిన ఘనత ఎన్టీఆర్దని గుర్తుచేశారు. రాష్ట్రంలో అరాచక, రౌడీ పాలన నడుస్తోందని విమర్శించారు. ప్రతి పక్ష పార్టీలపై దాడులు, కుట్రలు జరుగుతున్నాయన్నారు. టీడీపీ అనేది పోరాటం పార్టీ అని ..మళ్లీ అధికారం లోకి వచ్చి ఎన్టీఆర్కు నివాళులు అర్పిస్తామని అచ్చెన్నాయుడు తెలిపారు.

Related Posts