YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ప్రగతి భవన్ కు వీహెచ్...

ప్రగతి భవన్ కు వీహెచ్...

హైదరాబాద్, మే 30,
కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హన్మంతరావు నేడు ప్రగతి భవన్‌కి వెళ్లారు. సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు ఆయన ముఖ్యమంత్రి అధికారిక నివాసానికి చేరుకున్నారు. అయితే కేసీఆర్‌ను క‌లుద్దామంటే ఆయ‌న అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని మండిప‌డ్డారు. కరోనాతో చనిపోయిన వారికి రెండు లక్షల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.ప్రజా సమస్యలపై తన పోరాటం కొనసాగుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడూ అపాయింట్మెంట్ ఇవ్వరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలపైన సీఎంకు ఎన్ని లేఖలు రాసిన స్పందన లేదని వీహెచ్ పేర్కొన్నారు.అయినా కూడా సమస్యలపై తన పోరాటం ఆగదన్నారు వీహెచ్.

Related Posts