YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఆనందయ్యను వేధిస్తున్నారు- కేఏ పాల్

ఆనందయ్యను వేధిస్తున్నారు- కేఏ పాల్

హైదరాబాద్, మే 30,
ప్రజాశాంతి పార్టీ అధినేత, క్రైస్తవ మత గురువు డాక్టర్ కేఏ పాల్.. నెల్లూరు జిల్లాకృష్ణపట్నం ఆనందయ్యకు మద్దతుగా నిలిచారు. ఆనందయ్య కనిపెట్టిన ఆనందయ్య మందు దేవుడిచ్చిన వరమని పేర్కొన్నారు. ఆనందయ్యతో తాను కొన్ని గంటల క్రితమే మాట్లాడానని, ప్రస్తుతం ఆయన పోలీసుల వలయం ఉన్నారని చెప్పారు. ఈ మేరకు కేఏ పాల్ అమెరికా నుంచి వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. ఇండియాలో ప్రైవేలు ఆసుపత్రులు ప్రజల నుంచి ఘోరంగా దోచుకుంటున్నాయని, జనాలను పీల్చిపిప్పి చేస్తున్నాయని ఆరోపించారు.ప్రైవేటు ఆస్పత్రులు రాబందులుగా మారి ప్రజలను పీక్కుతింటున్నాయని కేఏ పాల్ ఆరోపించారు. తాను కూడా ఈ ప్రైవేటు ఆస్పత్రుల బాధితుడినేనని గుర్తు చేసుకున్నారు. రెండేళ్ల క్రితం తన సొంత తల్లి విశాఖపట్నంలో ఆస్పత్రిలో చనిపోయారని చెప్పారు. ఆమెను ప్రైవేటు ఆస్పత్రి వారే 20 రోజుల తర్వాత చంపేశారని భావోద్వేగం చెందారు. ఇటీవలే మే 4వ తేదీన తన కోడలు జ్యోతి తల్లి కూడా చనిపోయారని.. ఈ వార్తలన్నీ మనసును ముక్కలు చేస్తున్నాయని పేర్కొన్నారు.ఇండియాలో మెడికల్ ఫెసిలిటీస్ ఇంత ఘోరంగా తయారయ్యాయని కేఏ పాల్ చెప్పారు. అలాగని.. తాను అందరినీ అనట్లేదని.. కొంతమంది మాత్రం దోచుకుతింటున్నారని పేర్కొన్నారు. కరోనా ఉధృతి కారణంగా లక్షలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని, ఈ సమయంలో ఆనందయ్యను దేవుడు వరంగా ఇచ్చారన్నారు. ప్రకృతి సహజంగా లభించిన మూలికలతో మందులను తయారు చేస్తున్న ఆనందయ్యను కాపాడుకోవాలన్నారు. ఆయన ఉన్న చోటికి లోకల్ చానల్స్ నుంచి జాతీయ మీడియా వరకు అందరూ వెళ్లి విచారణ జరపాలని కోరారు. 4గంటల క్రితమే ఆనందయ్య సమీప బంధువు సంపత్ రాజ్‌తో మాట్లాడినట్లు కేఏ పాల్ చెప్పారు. వాళ్లు తనకు క్లియర్‌గా తాము స్వేచ్ఛగా లేమని చెప్పారని వెల్లడించారు. ఆ ఊరిలో ప్రస్తుతం వందలాది పోలీసులు ఉన్నారని, బెడ్రూంలో కూడా ఉన్నారన్నారు.
ఆయుష్ సంస్థతో పాటు, ఐసీఎంఆర్, నిపుణులు ఆనందయ్య మందు వల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేవని చెప్పారని కేఏ పాల్ పేర్కొన్నారు. అటువంటప్పుడు ఆనందయ్యను ఎందుకు నిర్బంధంలో ఉంచారని ప్రశ్నించారు. ఆనందయ్యను వెంటనే విడుదల చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, డీజీపీ, సుప్రీం సీజేఐ, హైకోర్టు సీజేఐలను కోరాలని సూచించారు.సరైన మందు లేని కరోనాపై పోరుకు ఆనందయ్య తమతో చేతులు కలపబోతున్నట్లు కేఏ పాల్ వెల్లడించారు. ఆనందయ్య, తాము కలిసి రాష్ట్రంలో మందు గురించి చెప్పబోతున్నామని.. దీని గురించి తెలుసుకునేందుకు ప్రజలంతా రెడీ కావాలని సూచించారు. దీని కోసం డాక్టర్ కేఏ పాల్ సేవ్ ఇండియా వెబ్‌సైట్‌లో జాయిన్ కావాలన్నారు. నేరుగా ప్రజలకే ఆనందయ్య మందు గురించి ట్రైనింగ్ ఇస్తామని వెల్లడించారు. ఈ మందుకు సంబంధించి ఏమేమీ కావాలో తాము చెబుతామని.. ప్రజలు అడవుల్లోకి వెళ్లి ఆ ఆకులు, మూలికలు తెచ్చుకోవాలని సూచించారు.తాము 23 జిల్లాల్లో ఉన్న, దేశంలోని 29 రాష్ట్రాల్లో ప్రోగ్రాం ముఖ్య నాయకులతో ప్రోగ్రాం చేయబోతున్నామని.. ఆనందయ్య బయటకు రాగానే ఫోన్ చేస్తానని చెప్పారు. ఈ విషయాన్ని స్వయంగా సంపత్ రాజ్ ఫోన్ చేసి చెప్పారని గుర్తు చేశారు. సెక్యురిటీ పేరుతో ఆనందయ్యను నిర్బంధించారని.. వెంటనే ఆయన్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Related Posts