YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఏ పీలో హైవేల అభివృద్ధికి భారీ నిధులు

ఏ పీలో హైవేల అభివృద్ధికి భారీ నిధులు

న్యూఢిల్లీ, మే 30,
ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారుల అభివృద్ధికి మార్గం సుగమమైంది. రాష్ట్రంలో హైవేల విస్తరణ, అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది రూ.6,421కోట్లు కేటాయించింది. రాష్ట్ర చరిత్రలోనే ఈ కేటాయింపులు అత్యధికమని అధికారులు చెబుతున్నారు. ఈ నిధులతో ఏపీలోని 609 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టనుంది. హైవేల నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు కూడా కేంద్ర ప్రభుత్వమే పూర్తిస్థాయి నిధులు కూడా సమకూర్చనుంది.రాష్ట్రాల్లో జాతీయ రహదారులను రెండు విధాలుగా అభివృద్ధి చేస్తారు. కొన్ని హైవేల నిర్మాణాలను కేంద్ర ప్రభుత్వానికి చెందిన జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) నేరుగా చేపట్టగా, మరికొన్ని పనులను ఆర్‌ అండ్‌ బీ జాతీయ రహదారుల విభాగం చేపడుతుంది. అయితే చాలాకాలంగా రాష్ట్రంలోని హైవేల అభివృద్ధికి కేంద్రం అరకొర నిధులే కేటాయిస్తోంది. దీంతో జాతీయ రహదారుల అభివృద్ధి ప్రణాళికలు కార్యరూపం దాల్చడం లేదు.అయితే 2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్‌ జగన్‌ ఈ అంశంపై దృష్టి సారించారు. 2019–20లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేవలం రూ.269 కోట్లే కేటాయించింది. దీంతో ప్రత్యేక దృష్టి పెట్టిన జగన్ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసి రాష్ట్రానికి భారీగా నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్రం ఆ కేటాయింపులను రూ.269 కోట్ల నుంచి ఏకంగా రూ.1,830 కోట్లకు పెంచింది. అనంతరం 2020–21లో రాష్ట్రానికి రూ.2,702 కోట్లు కేటాయించిన కేంద్రం.. ఈ ఏడాది ఏకంగా రూ.6,421 కోట్లు కేటాయించడం విశేషం.

Related Posts