YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

కూతురితో ఏకాతం తట్టుకోలేక చంపేశాడు

కూతురితో ఏకాతం తట్టుకోలేక చంపేశాడు

తిరుపతి, మే 30,
చిత్తూరు జిల్లా పలమనేరులో జరిగిన యువకుడి పరువు హత్యలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన కూతురిని ప్రేమించాడన్న కోపంతో ధనశేఖర్ అనే యువకుడిని బాబు అనే వ్యక్తి కిరాతకంగా చంపేసి ముక్కలుగా నరికేసి తన పొలంలో పాతిపెట్టాడు. నాలుగు రోజుల తర్వాత బయటపడ్డ ఈ దారుణం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. పొలంతో పాతిపెట్టిన అవయవాలను వెలికితీసిన పోలీసులు వాటిని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నాలుగు రోజులుగా కనిపించకుండా పోయిన కొడుకు ఇక లేడని తెలుసుకున్న ధనశేఖర్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు డీఎస్పీ గంగయ్య కథనం ప్రకారం.. పలమనేరు మండలం పెంగరగుంట గ్రామానికి చెందిన ధనశేఖర్(23) బెంగళూరులో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. పక్కింట్లో ఉండే బాలిక(16)ను కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి లేకపోవడంతో శేఖర్ గతవారం గ్రామానికి వచ్చేశాడు. ఈ నెల 22న తను ఇంట్లో ఒంటరిగా ఉన్నట్లు బాలిక తన తండ్రి ఫోన్‌ ద్వారా అతడికి మెసేజ్ చేసింది. దీంతో ఆమె ఇంటికి వెళ్లి ఏకాంతంగా ఉన్న సమయంలో బాలిక తండ్రి బాబు ఇంటికి వచ్చాడు. తన కూతురితో గదిలో ఉన్న ధనశేఖర్‌ను చూసి బాబు ఆవేశంతో రగిలిపోయాడు.‘నీతో మాట్లాడాలి’ అంటూ ధనశేఖర్‌ను బాబు వ్యవసాయ పొలం వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ కత్తితో అత్యంత పాశవికంగా నరికి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని తన వ్యవసాయ బావిలో పడేశాడు. మూడు రోజుల తరువాత మృతదేహం ఉబ్బిపోయి పైకి తేలింది. దీంతో హత్య గురించి అందరికీ తెలిసిపోతుందని భావించిన బాబు.. మృతదేహాన్ని బయటకి తీసి ముక్కలుగా చేసి తన పొలంలో పూడ్చి పెట్టాడు. కొడుకు కనిపించకపోవడంతో ధనశేఖర్ తండ్రి ఈనెల 26న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాలిక తండ్రే తమ కుమారుడిని ఏదో చేసి ఉంటాడని ఆరోపిస్తూ ఆ కుటుంబసభ్యులు గురువారం సాయంత్రం రోడ్డుపై ఆందోళన చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు శేఖర్ కాల్‌డేటాను విశ్లేషించి బాలిక తండ్రే ఈ హత్య చేసినట్లు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా ఎంత కిరాతకంగా హత్య చేసిందీ పూసగుచ్చినట్లు వివరించాడు. దీంతో పోలీసులు శుక్రవారం మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పలమనేరు సీఐ జయరామయ్య ఆధ్వర్యంలో ఎస్‌ఐ నాగరాజు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు. ధనశేఖర్‌ను హత్య చేసిన బాబుతో పాటు ఆయనకు సహకరించిన అందర్నీ అరెస్టు చేస్తామని డీఎస్పీ గంగయ్య స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించి బాబుతో పాటు ఆయన భార్య, కుమార్తెను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది

Related Posts