YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

14 మెడికల్ కాలేజీలకు శంఖుస్థాపన

14 మెడికల్ కాలేజీలకు శంఖుస్థాపన

అమరావతి
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 14 వైద్య కళాశాలల నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారు.విశాఖ జిల్లా అనకాపల్లిలో ఏర్పాటు చేయనున్న మెడికల్ కాలేజీ భవనాలను తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానం ద్వారా శంకుస్థాపన చేశారు. ఒక్కో పార్లమెంటు నియోజవర్గాలని ఒక్కో మెడికల్ కాలేజీల ఏర్పాటు దిశగా రాష్ట్రంలో 16 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయనున్నారు.ఈ వర్చువల్ శంకుస్ధాప కార్యక్రమంలో మంత్రి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యే అమర్నాధ్  పాల్గోన్నారు.ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ... ప్రతి పార్లమెంట్ పరిధిలోనూ టీచింగ్ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నామని, మెడికల్ కాలేజీలకు అనుబంధంగా నర్సింగ్ కళాశాలలు కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.పాదయాత్రలో ఇచ్చిన హామీలఖ్ అనుగుణంగా సీఎం జగన్ పాలన అందిస్తున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు.మెడికల్ కళాశాల,సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ని తీసుకురావడంలో అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు ప్రముఖ పాత్ర పోషించారని చెప్పారు.

Related Posts