YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

కేసిఆర్ అండ్ కంపెనీకి స్కిజోఫ్రేనియా వ్యాధి ముదిరింది భ్రాంతిలో బ‌తుకడం వ్యాధి లక్షణం మీ జీవితంలో ఒక్క నిజ‌మైనా చెప్ప‌రా..? మ్యానిఫెస్టోపై చ‌ర్చ‌కు వ‌చ్చే ద‌మ్ముందా! టిపిసిసి ముఖ్య అధికారి ప్ర‌తినిధి డాక్ట‌ర్ దాసోజు శ్ర‌వ‌న్

కేసిఆర్ అండ్ కంపెనీకి స్కిజోఫ్రేనియా వ్యాధి ముదిరింది       భ్రాంతిలో బ‌తుకడం వ్యాధి లక్షణం           మీ జీవితంలో ఒక్క నిజ‌మైనా చెప్ప‌రా..? మ్యానిఫెస్టోపై చ‌ర్చ‌కు వ‌చ్చే ద‌మ్ముందా! టిపిసిసి ముఖ్య అధికారి ప్ర‌తినిధి డాక్ట‌ర్ దాసోజు శ్ర‌వ‌న్

కేసిఆర్ అండ్ కంపెనీకి స్కిజోఫ్రేనియా వ్యాధి ముదిరిపోయింద‌ని, అందుకే భ్రాంతిలో బ‌తుకుతున్నార‌ని, ఏ హామీ అమ‌లు చేయ‌కుండానే అన్ని చేసిన‌ట్టు, వంద శాతం హ‌మీలు అమ‌లు అయిన‌ట్టు క‌ల‌లు కంటున్నార‌ని, అబ‌ద్దాల‌తో కాలం వెల్ల‌దీస్తూ ప్ర‌జ‌ల‌ను కూడా భ్రాంతి క‌ల‌గ‌జేస్తున్నార‌ని ఇవ‌న్నీ స్కిజోఫ్రేనియా వ్యాధి ల‌క్ష‌ణాలేన‌ని టిపిసిసి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ముఖ్య అధికారి ప్ర‌తినిధి డాక్ట‌ర్ దాసోజు శ్ర‌వ‌న్ అన్నారు. సోమ‌వారం నాడు గాంధీభ‌వ‌న్‌లో టిపిసిసి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మ‌హేశ్ కుమార్ గౌడ్ తో క‌లిసి ఆయ‌న విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు. మంత్రి జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి ఉత్త‌మ్ కుమార్ రెడ్డిపై చేసిన వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో దాసోజు శ్ర‌వ‌న్ జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డిపై విరచుప‌డ్డారు.చేయ‌నిది చేసిన‌ట్లుగా, లేనిది ఉన్న‌ట్లుగా భ్రాంతికి గురికావ‌డం  స్కిజోఫ్రేనియా వ్యాధి ల‌క్ష‌ణం.ఈ వ్యాధి ముదిరిపోతే పూర్తిగా పిచ్చిప‌డుతుంది.. ఆ త‌ర్వాత దాన్ని బాగు చేయ‌డం కూడా సాధ్యం కాదు..ప్ర‌స్తుతం ఈ ప్ర‌మాద‌క‌ర‌మైన వ్యాధి మంత్రి జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డికే కాదు కేసీఆర్ గ్యాంగ్ మొత్తానికి  వ్యాధిసోకిందని అన్నారు. అందుకే ఏమీ చేయ‌క‌పోయినా అన్నీ చేసేశామ‌న్న భ్రాంతిలో వారు బ‌తుకుతూ ప్ర‌జ‌ల్ని కూడా అదే భ్రాంతిలో బ‌త‌కాల‌ని కోరుకుంటున్నారని, కేసీఆర్‌కు స్కిజోఫ్రేనియా రాక‌పోతే తాము క‌ట్ట‌ని డ‌బుల్ బెడ్‌రూం ఇండ్లు కాంగ్రెస్‌కు క‌న‌బ‌డ‌టం లేదా..? అని టీఆర్ ఎస్ ప్లీన‌రీ స్పీచ్‌లో ఎందుకు చెప్తారని ఆయ‌న ప్ర‌శ్నించారు. త‌మ పార్టీ ఎల‌క్ష‌న్ మేనిఫెస్టోలో ఒక్క హామీని కూడా పూర్తిగా నెర‌వేర్చ‌క‌పోయినా 100 శాతం హామీలు నెర‌వేర్చామ‌ని ఎందుకు చెప్పుకుంటారు..? పోనీ ఏ వాగ్దానాల‌ను  నెర‌వేర్చారో కేసీఆర్‌నో, జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డినో చెప్ప‌మ‌నండని, పేద‌లంద‌రికీ డ‌బుల్ బెడ్‌రూం ఇండ్లు ఇచ్చారా..? ద‌ళిత గిరిజ‌నుల‌కు 3 ఎక‌రాల భూమి ఇచ్చారా..? గిరిజ‌నుల‌కు, ముస్లింల‌కు 12శాతం రిజ‌ర్వేష‌న్లు ఇచ్చారా..? కేజీ టు పీజీ ఉచిత నిర్భంధ విద్య‌ను అమ‌లు చేసారా..?నిరుద్యోగుల‌కు ల‌క్ష ఉద్యోగాల‌ను ఇచ్చారా..? కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల‌ను ప‌ర్మినెంట్ చేసారా..?ఫీజు రియంబ‌ర్స్ మెంట్ బ‌కాయిల‌ను చెల్లించారా..? మ‌హిళా యూనివ‌ర్సిటీని పెట్టారా..? నియోజ‌క‌వ‌ర్గానికి ల‌క్ష ఎక‌రాల‌కు సాగు నీళ్లు ఇచ్చారా..? సింగ‌రేణిలో ఓపెన్‌కాస్ట్ మైనింగ్‌ను నిలిపేసారా..? మూసేసిన నిజాం చ‌క్కెర క‌ర్మాగారం, సిర్పూర్ కాగ‌జ్ మిల్లును తెరిపించారా..? బ‌య్యారం స్టీల్ ఫ్యాక్ట‌రీని ఏర్పాటు చేయించ‌గ‌లిగారా..? ఇవేమీ చేయ‌కుండానే అన్నీ చేసేశాం.. రాష్ట్రంలో ఇక చేయాల్పిందేమీ లేదు.. ఇక దేశాన్ని ఉద్ద‌రిస్తామ‌ని మాట్లాడుతున్నారంటే అది హెల్యూసినేష‌న్ కాకుండా మ‌రేమిటో చెప్ప‌మ‌నండని ఆయ‌న ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. టీఆర్ ఎస్ మేనిఫెస్టోలోని ఏ పేజీలో ఉన్న ఏ హామీపైనైనా ప్ర‌జ‌ల మ‌ధ్య, మీడియా ఎదుట‌ బ‌హిరంగంగా చ‌ర్చించ‌డానికి మేము సిద్ధంగా ఉన్నాం.. దీనికి హెల్యూసినేష‌న్ బ్యాచ్ సిద్ధంగా ఉందా..? అయితే ఈ చ‌ర్చ గాంధీభ‌వ‌న్‌లో కాదు, మీ దొర క‌ట్టుకున్న పైర‌వీ భ‌వ‌న్‌లో పెట్టండి.. మేము రావ‌డానికి సిద్ధంగా ఉంటాము.. ప్ర‌జాస్వామ్యంలో చ‌ర్చ‌లు ఉండాలే కానీ చాలెంజ్‌లుండ‌వ‌ని, కేసిఆర్ ఏమైనా సినిమా హీరోనా ఛాలెంజ్‌లు చేయ‌డానిక‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.డుగుల జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి ఈ మ‌ధ్య చాలా మాట్లాడుతున్నాడని, మాట్లాడాల్సిన స‌మ‌యంలో మాట్లాడ‌డుగానీ, కేసీఆర్ ఉస్కో అంటే మొర‌గ‌డం బాగా నేర్చుకున్నాడని, గ్యాంగ్‌స్ట‌ర్ న‌యీంతో సంబంధాలు బ‌య‌ట‌ప‌డిన‌ప్పుడే జైలుకు వెళ్లాల్సిన వాడు కేసీఆర్ కాళ్లుప‌ట్టుకొని బ‌య‌ట‌ప‌డ్డాడని ఆయ‌న ఆరోపించారు.  నిన్న‌గాక మొన్న సూర్యాపేట క‌లెక్ట‌రేట్ భ‌వ‌నాల విష‌యంలో రియ‌ల్ ఎస్టేట్ ద‌ళారుల‌కు అమ్ముడుపోయి ప‌బ్లిక్‌గ్గా దొరికిన దొంగ జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడని అస‌లు జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డికి హెల్యూసినేష‌న్ తో పాటుగా అల్జీమ‌ర్ వ్యాధి కూడా ఉన్‌ాట్లుగా ఉందని అందుకే తాను ఏ శాఖ మంత్రి అన్న‌ది కూడా ఆయ‌న‌కు గుర్తున్న‌ట్లుగా లేదని ఆయ‌న అన్నారు. ఎస్సీ స‌బ్ ప్లాన్‌లో ద‌ళితుల సంక్షేమానికి కేటాయించిన నిధుల్లో 50 శాతం కూడా ఖ‌ర్చు చేయ‌లేద‌ని కాగ్ ఖాండ్రించి ఉమ్మేసినా సాంఘిక సంక్షేమ‌శాఖ మంత్రిగా ఆ విష‌యం గురించి మాట్లాడ‌లేదని,  బ‌హిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోళ్ల‌లో 5 వేల కోట్ల‌కు పైగా దుర్వినియోగం జ‌రిగింద‌ని కాగ్ చెప్పినా విద్యుత్ శాఖ మంత్రిగా ఆ విష‌యం గురించి కూడా మాట్లాడ‌లేదని., జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డికి సిగ్గు ఉంటే అల్జీమ‌ర్ వ్యాధి లేక‌పోతే సాంఘిక సంక్షేమ‌, విద్యుత్ శాఖ‌ల మంత్రిగా కాగ్ లేవ‌నెత్తిన అభ్యంత‌రాల‌పై జ‌వాబు చెప్పాలని ఆయ‌న నిల‌దీశారు.ఉత్త‌మ్ కుమార్ రెడ్డి తాను సైన్యంలో ప‌ని చేసిన క్ర‌మ‌శిక్ష‌ణ క‌లిగిన సైనికుడిన‌ని చెప్పుకుంటే జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి నువ్వు సైన్యంలో ప‌ని చేసిన‌వ్‌.. జీతం తీసుకున్నావ్ అంతే క‌దా.. అంటున్నాడు.. అంటే ఆయ‌న అభిప్రాయం ప్ర‌కారం ఈ రోజున భార‌త‌దేశ స‌రిహ‌ద్దుల్లో త‌మ ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి పోరాడుతున్న సైనికులంద‌రూ కేవ‌లం జీతం కోసం ప‌ని చేసేవాళ్లేనా..?  దేశం కోసం సరిహ‌ద్దుల‌లో ప‌నిచేసే సైనికుల ప‌ట్ల ఇంత అవ‌మాన‌కరంగా మాట్లాడుతావా.. ఇదేనా నువ్ మంత్రిగా ఒక రాజ్యంగం మీద ప్ర‌మాణం చేసి ప్ర‌క‌టించే అభిప్రాయం, ఇదేనా సైనికుల ప‌ట్ల మీ పార్టీకి, ప్ర‌భుత్వానికి ఉన్న అభిప్రాయ‌మ‌ని ఆయ‌న నిల‌దీశారు. నేడు దేశంలో బ‌తికే వంద కోట్ల మంది గుండెల‌పై చెయ్యి వేసుకొని ప‌డుకోవాల‌ని మంచుకొండ‌ల్లో, మండిపోయే ఎడారుల్లో ప‌గ‌లూ రాత్రీ కంటిమీద కునుకులేకుండా కాపుకాసి, శ‌త్రువుల తూటాల‌కు గుండెల‌ను ఎదురొడ్డే సైనికుల‌కూ తేడా తెలియ‌ని స‌న్నాసి జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి అని  ఈ స్టేట్‌మెంట్‌తో తేలిపోయిందని ఆయ‌న విమ‌ర్శించారు. ఎవ‌రు ఏం మాట్లాడుతున్నారో.. ఎవ‌రేం చేస్తున్నారో ప్‌మజ‌ల‌కు బాగా తెలసున‌ని, ఉత్త‌మ్ కుమార్ రెడ్డి నాలుక‌ను ప్ర‌జ‌లు చీలుస్తారంటున్న జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డికి, కేసీఆర్ చెంచాగాళ్ల‌కి ద‌మ్ముంటే, వాళ్లు చెప్తున్న‌ది నిజ‌మేన‌నే న‌మ్మ‌కం ఉంటే.. వాళ్లకు హెల్యూసినేష‌న్‌, అల్జీమ‌ర్ వ్యాధులు లేవ‌ని న‌మ్ముతుంటే  తెలంగాణా ఉద్య‌మాల పురిటిగ‌డ్డ ఉస్మానియా ప్రాంగ‌ణానికి ర‌మ్మ‌ని చెప్పండి, అక్క‌డే తేలిపోతుంది ఎవ‌రికి ఏ వ్యాధి ఉందో, ఎవ‌రు ఎవ‌రి నాలుక‌ను చీలుస్తారో. తేలిపోతుంద‌ని ఆయ‌న అన్నారు. కాంగ్రెస్ ప్ర‌జల ప‌క్షాన తెలంగాణ సమ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ధ‌ర్మ‌పోరాటం చేస్తుంద‌ని ఇక్క‌డ తెలంగాణ ద్రోహుల‌ను, అవినీతి ప‌రుల‌ను ఎట్టి ప‌రిస్థితుల‌లో వ‌దిలి పెట్ట‌మ‌ని చివ‌ర‌కు మాదే విజ‌యం అవుతుంద‌ని, సామాజిక న్యాయం, ప్ర‌జాస్వామిక తెలంగాణ సాధించి తీరుతామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. 

Related Posts