YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

స్పీకర్ సీతారాం కు ఆనారోగ్యం మణిపాల్ ఆసుపత్రిలో చేరిక

స్పీకర్ సీతారాం కు ఆనారోగ్యం మణిపాల్ ఆసుపత్రిలో చేరిక

అమరావతి
ఆంధప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన్ను అమరావతి తాడేపల్లి లోని మణి పాల్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. సీతారాం గత రెండు రోజులుగా జ్వరంతో బాధపడు తున్నారు. కరోనా వైరస్ బారిన పడి సీతారాం దంపతులు గత నెల 12వ తేదీన కొవిడ్ నుంచి కోలుకున్నారు. సీతారాం కంటే ముందు.. ఆయన సతీమణి వాణీశ్రీకి వైరస్ సోకింది. దీంతో దంపతులిద్దరూ శ్రీకాకుళంలోని మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స పొంది అనంతరం కోలుకుని ఇంటికి వెళ్లారు. అయితే, ఆదివారం నుండి సీతారాం అస్వస్థతకు గురై బాధపడుతుం డటంతో ఆయన్ను మెరుగైన చికిత్స కోసం అమరావతిలోని మణిపాల్ ఆస్పత్రికి తరలించారు.

Related Posts