YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

పోలీసులకు ఆత్మీయ వీడ్కోలు

పోలీసులకు ఆత్మీయ వీడ్కోలు

గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయములో సోమవారం పదవీ విరమణ పండుగ వాతావరణం కనిపించింది.  రాచకొండ, సైబరాబాద్ పోలీసు ఉద్యోగులను సైబరాబాద్ పోలీసు కమిషనర్ విసి సజ్జనార్  పూలమాల వేసి, శాలువా కప్పి సత్కరించారు. అదే విధంగా కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ నుంచి పదవీ విరమణ సందర్భంగా రావాల్సిన నగదుతో పాటుగా ఎంప్లాయి బెనిఫిట్ ఫండ్ నుంచి రూ.20,000 తో పాటు పెన్షన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా పదవీ విరమణ పొందిన అధికారులు పోలీస్ వృత్తిలో తమ అనుభవాలను సిపితో పంచుకున్నారు.  పదవి విరమణ పొందిన అధికారులతో, కుటుంబ సభ్యులతో మధ్యాహ్నం భోజనం చేస్తూ సరదాగా గడిపారు. వీరారెడ్డి, (సైబరాబాద్ కంట్రోల్ రూములో ఇన్స్ పెక్టర్ ), మహమ్మద్ మోయియుద్దీన్ ( కేపీహెచ్ బీ ఎస్సై), జీ శ్యాం (ఏఆర్ ఎస్సై సైబరాబాద్), పీ బాలాజీ (ఏఎస్సై రాయదుర్గం), రామచంద్రారెడ్డి  (ఏఎస్సై తలకొండపల్లి), మహమ్మద్ మహమూద్ పాషా ఏఆర్ ఎస్సై ( రాచకొండ), రాథోడ్ రామచందర్ (ఏఆర్ ఎస్సై రాచకొండ), ఉప్పల్ ట్రాఫిక్ పోలీసు స్టేషన్ కు చెందిన బీజే దయకర్ ఈరోజు పదవీ విరమణ చేసారు.    ఈ కార్యక్రమంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనర్, సైబరాబాద్ పరిపాలన అధికారి కే. నరసింహ, రాచకొండ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్  మాలిక, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ రవి కుమార్, సైబారాబాద్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు సిహెచ్. భద్రా రెడ్డి, ఉపాధ్యక్షులు ఎండి. యాహియా, సభ్యులు జి. కృష్ణ రెడ్డి, శివ కుమార్ , బీడీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts