YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

పెయింటింగ్ కు ఫిదా

పెయింటింగ్ కు ఫిదా

హైదరాబాద్, జూన్ 4,
ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన భార్య శోభారావుకు సంబంధించి ఓ ఫోటో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఆ ఫోటో కేసీఆర్, శోభకు సంబంధించిన ఓ పెన్సిల్ స్కెచ్. కరీంనగర్‌కు చెందిన ప్రముఖ చిత్రకారుడు కలికోట వెంకటాచారి ఈ పెయింటింగ్‌ను గీశారు. ఈ పెయింటింగ్‌లో కేసీఆర్, శోభ ఇద్దరూ యాగంలో ఉన్నట్లుగా ఉంది. కేసీఆర్ తన భార్య వంక చిరునవ్వుతో చూస్తుండగా, ఆయన భార్య శోభ సిగ్గుపడుతూ ఉన్నారు సోషల్ మీడియాలో చిత్రకారుడు కలికోట వెంకటాచారి ఈ ఫోటోలను పోస్ట్ చేయగా అవి వైరల్‌గా అయ్యాయి. ఈ ట్వీట్‌కు కేటీఆర్, హిమన్షులను కూడా ట్యాగ్ చేశారు. అయితే, తన తాతయ్య, నానమ్మ ఫోటో పట్ల మనమడు హిమాన్షు సంతోషం వ్యక్తం చేశారు. పెయింటింగ్ అద్భుతంగా ఉందంటూ సంబరపడిపోయారు. పెయింటింగ్ గీసిన వారికి హిమాన్షు ధన్యవాదాలు చెప్పారు. ఈ మేరకు ఆ ఫోటోను హిమాన్షు రీట్వీట్ చేశారు.రంగు పెన్సిళ్లతో గీసిన ఈ ఆర్ట్‌ను తొలుత కలికోట వెంకటాచారి ట్విట్టర్‌లో షేర్ చేయగా.. ఆ తరువాత యర్రోజు చందు అనే వ్యక్తి ఆ ట్వీట్‌ను మంత్రి కేటీఆర్, ఆయన తనయుడు హిమాన్షుకు ట్యాగ్ చేస్తూ రీట్వీట్ చేశారు. దాంతో ఆ పెన్సిల్ ఆర్ట్ హిమాన్షు కంట పడింది. దీంతో వెంటనే రియాక్ట్ అయ్యారు. ఈ పెయింట్ అద్భుతంగా ఉందంటూ మెచ్చుకుని, రీట్వీట్ చేశారు. దీనికి నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది.

Related Posts