హైదరాబాద్ జూన్ 4
కరోనా కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం చెందాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్కు సంబంధించి టీ.కాంగ్రెస్ నేతలతో కలిసి గవర్నర్కు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం కోవిడ్ 19 విషయంలో వైఫల్యం చెందిన విషయాన్ని గవర్నర్కు వివరించామన్నారు. అలాగే కాంగ్రెస్ పక్షాన కొన్ని అంశాలను తమిళిసై దృష్టికి తీసుకువచ్చి, మరికొన్ని అంశాలు భారత రాష్ట్రపతికి పంపించాలని కోరామన్నారు.కోవిడ్ విషయంలో నరేంద్రమోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఉత్తమ్ ఆరోపించారు. మిస్ మేనేజ్మెంట్ వల్ల దేశంలో కోట్లాదిమంది ప్రజలు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ కూడా చిన్నాభిన్నమైందన్నారు. గవర్నర్ను కలిసినవారిలో ఉత్తమ్తోపాటు భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరులు ఉన్నారు.