హైదరాబాద్ జూన్ 4
స్పీకర్ అపాయింట్మెంట్ తీసుకుని రాజీనామా పత్రం అందజేస్తానని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రకటించారు. వచ్చే వారం ఢిల్లీలో బీజేపీలో చేరుతానని వెల్లడించారు. తాను వామపక్ష, లౌకిక వాదిని.. కానీ పరిస్థితులు తనను అటువైపు తీసుకెళ్లాయని తెలిపారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించేందుకు టీఆర్ఎస్ ప్రయత్నించిందని ఆరోపించారు. ఇప్పటికే హుజురాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ రూ.50కోట్లు ఖర్చుపెట్టిందని తెలిపారు. బీజేపీ అగ్రనేతల సమావేశంలో టీఆర్ఎస్తో సంబంధాల గురించి చర్చించానని తెలిపారు. మంత్రి హరీష్రావు తనకంటే ఎక్కువగా అవమానాలకు గురయ్యారని చెప్పారు. అవమానాలు పడుతున్న మాజీ ఎమ్మెల్యేలు తనతో రావడానికి సిద్ధంగా ఉన్నారని ఈటల రాజేందర్ తెలిపారు.