YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ప‌ర్యావ‌ర‌ణాన్ని ప‌రిర‌క్షించాలి : ప్ర‌జ‌ల‌కు సీఎం కేసీఆర్ పిలుపు

ప‌ర్యావ‌ర‌ణాన్ని ప‌రిర‌క్షించాలి : ప్ర‌జ‌ల‌కు సీఎం కేసీఆర్ పిలుపు

హైద‌రాబాద్ జూన్ 4
శనివారం  ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వం పుర‌స్క‌రించుకుని ప‌ర్యావ‌ర‌ణాన్ని ప‌రిర‌క్షించాల‌ని ప్ర‌జ‌ల‌కు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌ను మించిన సంప‌ద లేదు. ప్ర‌స్తుత క‌రోనా స‌మ‌యంలో ఈ విష‌యం రుజువైంది. స్వ‌చ్ఛ‌మైన ప్రాణ వాయువు దొరక్క ప‌రిత‌పిస్తున్న దుర్భ‌ర ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఆరోగ్య సంప‌ద‌ను మించిన సంప‌ద లేదు. భ‌విష్య‌త్ త‌రాల‌కు ఆరోగ్య‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం క‌ల్పించ‌డానికి తెలంగాణ ప్ర‌భుత్వం కార్యాచ‌ర‌ణ చేప‌ట్టింది. నాసిర‌కం ప్లాస్టిక్ వాడకం మీద నియంత్ర‌ణ విధించాం. గ్రీన్ క‌వ‌ర్ పెంచే హ‌రిత‌హారం వంటి ప‌లు ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నాం అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

Related Posts