YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఏపీ సీఐడీ అడిషనల్‌ డీజీకి రఘురామలీగల్‌ నోటీసులు

ఏపీ సీఐడీ అడిషనల్‌ డీజీకి రఘురామలీగల్‌ నోటీసులు

అమరావతి జూన్ 5
ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ అడిషనల్‌ డీజీ సునీల్‌ కుమార్‌కు నర్సాపురం వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామకృష్ణరాజు తరుఫు న్యాయవాది శనివారం లీగల్‌ నోటీసులు పంపారు. అరెస్ట్‌ సమయంలో పోలీసులు తన నుంచి తీసుకున్న ఐఫోన్‌ను తిరిగి ఇవ్వాలని ఎంపీ రఘురామ నోటీసులో పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న ఐఫోన్‌ను రికార్డుల్లో ఎక్కడా చూపలేదని విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తన ఫోన్‌లో కుటుంబ సభ్యులకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం ఉందని ఎంపీ పేర్కొన్నారు. పార్లమెంట్‌ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా తనకు సంబంధించిన చాలా విలువైన సమాచారం ఫోన్‌లోనే ఉందని.. పార్లమెంట్‌ విధులను నిర్వర్తించడానికి ఫోన్ తిరిగి ఇవ్వాలని నోటీసులో ఎంపీ రఘురామ సీఐడీ అదనపు డీజీ సునీల్‌ కుమార్‌ను కోరారు. దీనిపై అదనపు డీజీ ఇంకా స్పందించలేదు.

Related Posts