YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

పులిగుండు..

పులిగుండు..

ఈ పర్వతం తిరుపతి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది పెనుమూరు మండలం ఉగ్రాణం పల్లి సమీపంలో ఉంది చుట్టూ మైదానం మధ్యలో భూమి లోపల నుంచి బయటకు చొచ్చుకొచ్చినట్లు కనిపించే అతి పెద్ద రాతి పర్వతం. లింగాకృతిలో ఉండే రెండు అతిపెద్ద రాతి పర్వతాలు చాలా అద్భుతంగా కనిపిస్తాయి. ఈ కొండ ఆకృతే కాదు.. ఈ కొండపై నుంచి కనిపించే ప్రకృతి అందాలు కూడా కనువిందు చేస్తాయి.ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతి నుంచి 50 కిమీల దూరంలోని పెనుమూరులో ఈ రాతి పర్వతం ఉంది. భూతలం నుంచి వెయ్యి అడుగుల ఎత్తులో ఉన్న ఈ కొండపైకి ఎక్కితే సుదూరంలో ఉన్న తిరుపతి పర్వతాలు, చుట్టపక్కల అటవీ ప్రాంతాలు చాలా అందంగా కనిపిస్తాయి. ఇక్కడికి వెళ్లేందుకు బస్సులు, ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి. రెండుగా చీలినట్లు కనిపించే ఈ పర్వతాలను పార్వతీ, పరమేశ్వరులుగా కొలుస్తున్నారు. పూర్వం పులులు ఈ కొండ గుహల్లోనే తలదాచుకునేవని, అందుకే ఈ ప్రాంతానికి పులిగుండు అని పేరు వచ్చిందని స్థానికులు చెబుతారు. ట్రెక్కింగ్ ఇష్టపడే పర్యాటకులు ఎక్కువగా పులిగుండుకు వచ్చేందుకు ఆసక్తి చూపుతారు.పులిగుండు పర్వతం మీదకు ఎక్కేందుకు రాతిమెట్లు, ఇనుప మెట్ల మార్గం అందుబాటులో ఉన్నాయి. వీటి మీద నుంచి పైకి చేరడమంటే సాహసం చేసినట్లే. పూర్వం ఇక్కడ మెట్లు ఉండేవి కాదు. భక్తులు నిచ్చెనలు, తాళ్ల సాయంతో కొండపైకి చేరేవారు. కొండపైన శివాలయం, అయ్యప్ప స్వామి ఆలయాలు ఉన్నాయి. మెట్ల మార్గంలో గణపతి, వేంకటేశ్వర స్వామి, అలివేలు మంగమ్మ తల్లి విగ్రహాలు కూడా దర్శనమిస్తాయి.పులిగుండు దిగువున ఉన్న పులిగుండేశ్వర ఆలయం, ఆంజనేయస్వామి ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతాయి. కనుమ రోజున పులిగుండేశ్వర స్వామి ఉత్సవాలు జరుగుతాయి. పులిగుండు సమీపంలో సహజ సిద్ధంగా ఏర్పడిన కొనేరు కూడా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. మీరు కూడా పులిగుండు అందాలను చూడండి.

Related Posts