YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

మాస్క్ ధరిస్తే ఫైన్

మాస్క్ ధరిస్తే ఫైన్

న్యూయార్క్, జూన్ 7,
కరోనా వైరస్‌ విజృంభిస్తున్న వేళ ప్రజలంతా మాస్క్‌లు ధరించాలని ప్రభుత్వాలు, నిపుణులు పదే పదే చెబుతున్నారు. దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాలూ మాస్క్ తప్పనిసరి నిబంధన తీసుకొచ్చి.. జరిమానాలు కూడా విధిస్తున్నాయి. అయితే, అమెరికాలో వ్యాక్సినేషన్ వేగవంతం కావడంతో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో టీకా రెండు డోస్‌లు వేసుకున్నవారికి మాస్క్‌ నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చారు. బహిరంగ ప్రదేశాల్లో వీరు ధరించాల్సిన అవసరం లేదని ఆధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించారు. కాలిఫోర్నియాలోని ఫిడిల్‌హెడ్‌ కేఫ్‌ రెస్టారెంట్‌ అమలు చేస్తున్న నిబంధన చూసి జనం అవాక్కమవుతున్నారు. తమ రెస్టారెంట్లోకి మాస్క్‌ ధరించి వస్తే బిల్లుపై 5 డాలర్లు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని నిబంధన తీసుకొచ్చింది. అదనంగా వసూలైన సొమ్మును స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వనున్నట్లు ఆ రెస్టారెంట్‌ యజమాని క్రిస్‌ కాస్టిల్‌మ్యాన్‌ వెల్లడించారు. స్వచ్ఛంద సంస్థలు, గృహహింస బాధితులకు చేయూత ఇవ్వడం కోసం కస్టమర్ల నుంచి 5 డాలర్లు ఈ విధంగా వసూలు చేయడం తన దృష్టిలో తప్పు కాదని క్రిస్‌ సమర్ధించుకున్నారు.టీకా తీసుకున్నవారు మాస్క్‌ ధరించాల్సిన అవసరం లేకున్నా చాలా మంది కరోనా వ్యాప్తికి భయపడి వాటిని ధరించే రోజువారీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు రెస్టారెంట్‌లో అదనంగా 5 డాలర్లు చెల్లించడానికైనా సిద్ధపడుతున్నారు గానీ మాస్క్‌ తీసేది లేదంటున్నారు. దీంతో రెస్టారెంట్‌ అదనంగా 5 డాలర్లు బాగానే వసూలవుతోంది. అయితే, కొందరు మాత్రం అదనంగా చెల్లించడానికి నిరాకరిస్తున్నారని క్రిస్ అన్నారు.

Related Posts