YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కాకాని ఆగ్రహం

కాకాని  ఆగ్రహం

నెల్లూరు, జూన్ 7, 
నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆనందయ్య తయారుచేసిన కరోనా మందు పంపిణీని ఎమ్మెల్యే సోమవారం గొలగమూడిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోజుకి 2-3 వేలమందికి ఆనందయ్య మందు పంపిణీ చేస్తామని, కరోనా రోగులు అల్లోపతి మందులు వాడుతూనే ఆనందయ్య మందు తీసుకోవాలని కాకాణి సూచించారు.ఆనందయ్య మందుతో ఎలాంటి దుష్పరిణామాలు ఉండవని చెప్పిన ఎమ్మెల్యే... ఇచ్చిన మాట ప్రకారం సోమవారం నుంచి పంపిణీ చేపట్టామని తెలిపారు. ప్రజలకు మేలుచేసే ఉద్దేశంతోనే ఆనందయ్యకు మద్దతిచ్చామని... ఆ మందును రాష్ట్రమంతగా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆనందయ్య కుటుంబానికి భవిష్యత్‌లోనూ అండగా నిలుస్తామని ఎమ్మెల్యే కాకాణి హామీ ఇచ్చారు. ఆనందయ్య మందు విషయంలో తనపై వచ్చిన ఆరోపణపై కాకాణి ఆవేదన వ్యక్తం చేశారు. ఆనందయ్య మందు ద్వారా తాను కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నించానని వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదన్నారు. ఒకవేళ ఆనందయ్య మందుతో తాను సొమ్ము వెనకేసుకున్నా, ఆ ఆలోచన వచ్చినా వెంకటేశ్వరుడి సాక్షిగా తన కుటుంబం సర్వనాశనం అయిపోతుందని కాకాణి గోవర్థన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన వారి సంగతి ఆ దేవుడే చూసుకుంటానని ఎమ్మెల్యే అన్నారు. ఆనందయ్య మందును వైసీపీ నేతలు అడ్డగోలుగా అమ్ముకుంటున్నారంటూ టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఎమ్మెల్యే ఇలా స్పందించినట్లు తెలుస్తోంది.

Related Posts