YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

షెకావత్ కు రఘురామ రాజు భేటీ

షెకావత్ కు రఘురామ రాజు భేటీ

న్యూఢిల్లీ, జూన్ 9, 
వైసీపీ రెబల్ ఎంపీరఘురామకృష్ణ రాజు స్పీడు పెంచారు. ఇప్పటి వరకూ తనను ఏపీ సీఐడీ పోలీసులు కొట్టారని.. ప్రభుత్వంపై విమర్శలు చేసినందుకు రాజద్రోహం కేసు పెట్టి హింసించారని కేంద్ర మంత్రులు, కీలక నేతలకు ఫిర్యాదు చేసిన రఘురామ.. ఇప్పుడు నేరుగా జగన్ సర్కార్‌కి గురిపెట్టారు. జగన్ సర్కార్ అవినీతికి పాల్పడుతోందని.. రివర్స్ టెండరింగ్ పేరుతో అంచనాలు పెంచి అప్పనంగా నిధులు కాజేస్తోందని కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశారు. కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను కలిసిన ఎంపీ రఘురామ పోలవరంలో అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. నిర్వాసితుల పేరుతో నకిలీ ఖాతాల్లోకి డబ్బు జమవుతోందని.. అసలు నిర్వాసితులను పక్కన పెట్టి నకిలీలకే నిధులు జమవుతున్నాయని ఆయన ఫిర్యాదు చేశారు. అలాగే రివర్స్ టెండరింగ్ పేరుతో అంచనాలు పెంచి అదనపు నిధులు కేటాయిస్తున్నారని.. కంపెనీల నుంచి 25 శాతం కమీషన్లు తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. తనను కొట్టి హింసించారని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటి వరకూ తనపై సీఐడీ పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఫిర్యాదులు చేస్తున్న రఘురామ.. ఊహించని విధంగా ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేయడం ఏపీ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఆయన ఫిర్యాదుపై జగన్ సర్కార్ ఎలా స్పందిస్తుందోనన్న ఉత్కంఠ
 

Related Posts