YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

రేవంత్ పై మంత్రి హాట్ కామెంట్స్

రేవంత్ పై మంత్రి హాట్ కామెంట్స్

హైదరాబాద్, జూన్ 9, 
ఈటల రాజేందర్ తర్వాత మంత్రి జగదీశ్ రెడ్డేనంటూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీరేవంత్ రెడ్డి చేసిన ట్వీట్‌పై మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. చెత్త మనుషులకు, చెత్త ఆలోచనలే ఉంటాయని కొట్టిపారేశారు. అలాంటి విషయాలపై తాను స్పందించాల్సిన అవసరంలేదని కొట్టిపారేశారు. బుధవారం జగదీశ్ రెడ్డి ఓ న్యూస్ ఛానెల్‌తో ఈ మేరకు మాట్లాడారు.పేదలందరికీ ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని జగదీశ్ రెడ్డి చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వం కొన్ని జిల్లా కేంద్రాల్లో డయాగ్నోస్టిక్ కేంద్రాలను ఏర్పాటు చేసిందని, త్వరలోనే మిగతా జిల్లాల్లోనూ ఆ సెంటర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. కరోనాకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందుతోందని జగదీష్‌రెడ్డి మరోసారి చెప్పారు.మంగళవారం రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ సంచలనం అయిన సంగతి తెలిసిందే. ‘రస’కందాయంలో హంపి ‘ధూమ్ ధామ్’... కోవర్ట్ ‘క్రాంతి’ కిరణాలతో కకావికలం... యముడు జగదీశ్ రెడ్డి ‘ఘంటా’ కొట్టినట్టేనా...? అంటూ ఆ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై నెటిజన్లు స్పందించారు. ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, క్రాంతి కిరణ్, మంత్రి జగదీశ్ రెడ్డిలను ఉద్దేశిస్తూ చేసినట్టుగా నెటిజన్లు వ్యాఖ్యానించారు. త్వరలో టీఆర్ఎస్ పార్టీ మరో సంచలనానికి వేదిక కాబోతోందనడానికి ఈ ట్వీట్ సూచిక అన్నారు.అయితే, గత జనవరిలో మంత్రి జగదీశ్ రెడ్డి తన కుమారుడి పుట్టినరోజు వేడుకలను కర్నాటకలోని హంపీలో జరిపారని ట్వీట్‌కు జత చేసిన పత్రికా కథనంలో ఉంది. ఈ వేడుకలకు నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కొంతమంది పార్టీ ప్రముఖులు హాజరయ్యారని, పేరుకు పుట్టిన రోజు వేడుకలైనా.. అక్కడ పార్టీ అంశాలే చర్చకు వచ్చినట్టుగా వార్తా కథనంలో పేర్కొన్నారు.

Related Posts