YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

వంశీ కార్యాలయంలో అగ్ని ప్రమాదం

వంశీ కార్యాలయంలో అగ్ని ప్రమాదం

గన్నవరం ఎమ్మెల్యే డాక్టర్‌ వల్లభనేని వంశీ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పలు పత్రాలు, సోఫా, టీవీ, ఏసీ, కంప్యూటర్‌ ఇతర గృహాపకరణలు కాలి బూడిదయ్యాయి. వంశీ కార్యాలయం పక్కనే ఉండే విశ్రాంతి గదిలో మంగళవారం రాత్రి వైరింగ్‌ పనులు జరిగాయి. ఆ తరువాత కొద్దిసేపటికే విద్యుదాఘాతంతో ఆ గదిలో మంటలు చెలరేగి ఒక్కసారిగా అంతటా వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకొనే లోపే జరగాల్సిన నష్టం జరిగింది. అయితే ఆ సమయంలో ఎమ్మెల్యే పర్యటనలో ఉండగా.. ప్రమాదం విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు, తెదేపా జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు ఘటనాస్థలానికి వచ్చి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో సుమారు మూడు లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

Related Posts