YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

శ్రీవారి ఆశీస్సులతో తన జీవితంలో ఎన్నో అద్భుతాలు....

శ్రీవారి ఆశీస్సులతో తన జీవితంలో ఎన్నో అద్భుతాలు....

తిరుమల జూన్ 11 : తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతోనే తాను ఈ స్థాయికి చేరుకున్నానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. సీజేఐ ఎన్వీ రమణ శుక్రవారం ఉదయం సతీసమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వాదం అనంతరం మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి ఆశీస్సులతో తన జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగాయన్నారు. న్యాయ వ్యవస్థను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషిచేస్తానని తెలిపారు.సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి తిరుమలకు వచ్చిన జస్టిస్‌ ఎన్వీ రమణ.. ఇవాళ ఉదయం సతీసమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద జస్టిస్ రమణకు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డి స్వాగతం పలికారు. ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు, ఇతర అర్చకులు ఎన్వీ రమణ దంపతులకు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో చీఫ్ జస్టిస్‌కు పండితులు వేద ఆశీర్వాదం అందించగా, టీటీడీ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు, చిత్ర పటం అందజేశారు. తరువాత శ్రీ బేడీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు.

Related Posts