YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

బెంగాల్ లో బీజేపీకి రెండో స్థానం

బెంగాల్ లో బీజేపీకి రెండో స్థానం

పశ్చిమ బెంగాల్ లో బీజేపీకి గ్రామస్థాయిలో ఎంతమాత్రమూ క్యాడర్ లేదని, వామపక్ష పార్టీల నేతలు కూడా తృణమూల్ కాంగ్రెస్ వైపు వెళ్లిపోయారని మరోసారి స్పష్టమైంది. ఇక పంచాయితీ సమితుల విషయానికి వస్తే టీఎంసీ 12,590, బీజేపీ 6,149, సీపీఐ (ఎం) 4,400, కాంగ్రెస్ 1,740 స్థానాలకు పరిమితం అయ్యాయి. నిమినేషన్ల విత్ డ్రాలోనూ టీఎంసీ తొలి స్థానంలో ఉండటం గమనార్హం. మొత్తం 2,407 స్థానాల్లో టీఎంసీ, 931 స్థానాల్లో బీజేపీ, 558 స్థానాల్లో సీపీఐ (ఎం), 301 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు తమ తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారని ఎన్నికల కమిషన్ ప్రకటించిందరాష్ట్రంలో పంచాయితీ ఎన్నికలు జరుగుతున్న వేళ, వివిధ గ్రామాల్లోని 20 వేల వార్డులను తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలుచుకోవడం గమనార్హం. ఈ వార్డుల్లో కనీసం పోటీ చేసేందుకు కూడా విపక్ష పార్టీలకు అభ్యర్థులు లేని పరిస్థితి నెలకొంది. ఏకగ్రీవంగా గెలిచిన అభ్యర్థుల జాబితాను రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది.మొత్తం 3,358 గ్రామ పంచాయతీల్లో 48,650 స్థానాలుండగా, 16,814 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయని, 341 పంచాయతీ సమితుల్లోని 9,217 స్థానాల్లో 3,059 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయని ప్రకటించింది. 20 జిల్లా పరిషత్ లలో 825 స్థానాలుండగా, 203 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయని వెల్లడిస్తూ, పోటీ ఉన్న స్థానాల్లో మే 14న ఎన్నికలు జరుగుతాయని పేర్కొంది. కాగా, టీఎంసీ మొత్తం 1000 జిల్లా పరిషత్ స్థానాలకు నామినేషన్లు వేయగా, ఆపై బీజేపీ 782 స్థానాల్లో, సీపీఐ (ఎం) 537 కాంగ్రెస్ 407 స్థానాల్లో పోటీ పడ్డాయి.

Related Posts